Sunday, May 19, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ:  బెంగుళూరుకు మరో విజయం

ప్రొ కబడ్డీ:  బెంగుళూరుకు మరో విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ లో జైపూర్ పై బెంగుళూరు విజయం సాధించింది. పాట్నా- తమిళ్ తలైవాస్  మధ్య జరిగిన మరో మ్యాచ్ టై అయ్యింది.

తమిళ్ తలైవా – పాట్నా పైరేట్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 30-30 తో   విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో  పాట్నా 18-12 తో ఆధిక్యం సంపాదించగా రెండో అర్ధ భాగంలో తలైవాస్ రాణించి 18-12 తో పైచేయి సాధించారు. దీనితో మ్యాచ్ టై గా ముగిసింది.

బెంగుళూరు బుల్స్ – జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన  రెండో మ్యాచ్ లో బెంగుళూరు 38-31 తో విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో బెంగుళూరు 20-14 తో ఆధిక్యం సంపాదించింది. రెండో అర్ధభాగంలో పింక్ పాంథర్స్ మెరుగ్గా రాణించినప్పటికీ బెంగుళూరు 18-17తో ఒక పాయింట్ ఆధిక్యం పొంది, మొత్తంగా ఏడు పాయింట్లతో విజయం సాధించింది.   బెంగుళూరు కెప్టెన్ పవన్ షెరావత్ 18 (13 టచ్, 4 బోనస్, 1టాకిల్) పాయింట్లు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత బెంగుళూరు మళ్ళీ ఆధిక్యంలో నిలిచి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. బెంగుళూరు బుల్స్ (28 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (26); పాట్నా పైరేట్స్ (24); తమిళ్ తలైవాస్ (22); యూ ముంబా(20); బెంగాల్ వారియర్స్ (16); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

Also Read : ప్రొ కబడ్డీ:  టైటాన్స్ ను వెంటాడిన దురదృష్టం

RELATED ARTICLES

Most Popular

న్యూస్