Sunday, September 8, 2024
Homeసినిమా'భోళాశంకర్' సెన్సార్ రిపోర్ట్ ఇదే

‘భోళాశంకర్’ సెన్సార్ రిపోర్ట్ ఇదే

వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళాశంకర్’. ఈ చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్టర్. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తే.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. సుశాంత్ గెస్ట్ రోల్ చేయడం విశేషం. అయితే.. భోళా శంకర్ మూవీ వేదాళం సినిమాకి రీమేక్. ఈ రీమేక్ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకాభిమానులు మెచ్చేలా తెరకెక్కించారని వార్తలు వస్తున్నాయి.

అయితే.. ఇది రీమేక్ మూవీ కావడంతో ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వలేదు. దీంతో భోళాశంకర్ ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తాడు అనేది ఆసక్తిగా మారింది. ఆగష్టు 11న భోళాశంకర్ మూవీ థియేటర్లోకి విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరుగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ సెన్సార్ కార్యక్రమ్యాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యుబైఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇంతకీ సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే… సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పే సన్నివేశాలు లేవట. యాక్షన్ తో పాటు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రొమాంటిక్ అండ్ ఎంటర్ టైనింగ్ గా ఈ చిత్రాన్ని రూపొందించారట.

చిరంజీవి ఎంటర్ టైన్మెంట్ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చేలా ఉందని… అలాగే చిరు, తమన్నా రొమాన్స్, శ్రీముఖితో చిరు ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ సీన్స్, సుశాంత్, కీర్తి సురేష్ ల లవ్.. ఇలా అన్ని అంశాలు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని సెన్సార్ రిపోర్ట్. అయితే.. ఈ సినిమా దాదాపు 100 కోట్ల టార్గెట్ తో థియేటర్లోకి వస్తుంది. ఎంతగా ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ బజ్ అయితే రావడం లేదు. అందుచేత భోళా శంకర్ ఎంత వరకు మెప్పిస్తాడు..? ఎంత కలెక్ట్ చేస్తాడు..? అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్