బిజెపి సీనియర్ నాయకుడు, విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్ గా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  కుటుంబ సమేతంగా నిన్న ఉదయం విశాఖ విమానాశ్రయం నుండి హరిబాబు కలకత్తా బయలుదేరి వెళ్లారు.  దమ్.దమ్  విమానాశ్రయంలో కొద్దిసేపు బెంగాల్ బిజెపి నేతలతో  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బెంగాల్ లోని తెలుగు సంఘాల ప్రతినిధులు హరిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

కంభంపాటి హరిబాబు కొద్దిసేపటి క్రితం కలకత్తా నుంచి  మిజోరాం పయనమయ్యారు. బిజెపి కార్యకర్తలు అభిమానులు విశాఖ విమానాశ్రయంలో హరిబాబుకు ఘనంగా వీడ్కోలు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *