Thursday, March 28, 2024
Homeసినిమాబ‌న్నీ, ఎన్టీఆర్ నో చెప్పిన కథ ఇదేనా?

బ‌న్నీ, ఎన్టీఆర్ నో చెప్పిన కథ ఇదేనా?

ఒక క‌థ‌ను ఓ హీరోతో చేద్దామ‌నుకుంటే… మ‌రో హీరోతో సెట్ అవుతుంటుంది. ఇది ఇండ‌స్ట్రీలో కామ‌న్. బ‌న్నీతో చేద్దామ‌న‌కుంటే.. కుద‌ర‌లేద‌ట‌. ఆత‌ర్వాత ఎన్టీఆర్ తో చేద్దామ‌నుకున్నా కుద‌ర‌లేద‌ట‌. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సెట్ అయ్యింది. అదే.. లైగ‌ర్. ఆ క‌థ‌ను రాసింది పూరి జ‌గ‌న్నాథ్. నిజ‌మా అని ఆశ్య‌ర్య‌పోతున్నారా..? ఇది నిజంగా నిజం. ఈ వార్త ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. బ‌న్నీతో పూరి ఇద్ద‌ర‌మ్మాయిల‌తో అనే సినిమా చేస్తున్న‌ప్పుడు లైగ‌ర్ క‌థ‌ను చెప్పాడ‌ట‌. క‌థ బాగుంది చేద్దామ‌న్నాడ‌ట కానీ.. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో ఆశించిన స్థాయిలో ఆడ‌క‌పోవ‌డంతో ఇంట్ర‌స్ట్ చూపించ‌లేద‌ట‌. ఆ త‌ర్వాత ఈ క‌థ‌ను ఎన్టీఆర్ కు చెప్పార‌ట పూరి. అక్క‌డ కూడా వ‌ర్కవుట్ కాలేదు. దీంతో ఈ క‌థ‌ను ప‌క్క‌న పెట్టి వేరే సినిమాల‌తో బిజీ అయ్యారు పూరి. విజ‌య్ తో సినిమా చేయాలి అనుకున్న‌ప్పుడు ఈ క‌థ చెప్పాడ‌ట‌.

క‌థ చెప్పిన వెంట‌నే విజ‌య్ ఈ సినిమా చేస్తాన‌ని చెప్పాడ‌ట‌. అలా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వ‌చ్చింది. కాక‌పోతే అప్పుడు చేసుంటే.. తెలుగులో మాత్ర‌మే చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా వ‌స్తుంది. ట్రైల‌ర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఆగ‌ష్టు 25న లైగ‌ర్ వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మ‌రి.. బ‌న్నీ, ఎన్టీఆర్ నో చెప్పిన లైగ‌ర్ ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read : పక్కా మాస్ లుక్ తో రమ్యకృష్ణ విజృంభించనుందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్