Sunday, September 8, 2024
HomeTrending Newsగోశాల నిర్వహణ అద్భుతం: చాగంటి

గోశాల నిర్వహణ అద్భుతం: చాగంటి

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలో ఉన్న గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు  అభినందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ధార్మిక సలహాదారుగా నియమితులైన చాగంటి కోటేశ్వర రావు నేడు సిఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.

చాగంటిని సత్కరించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమను ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా  కలిసిన శాంతా బయోటెక్నిక్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్, ఎండీ డాక్టర్‌ కే.ఐ. వరప్రసాద్‌ రెడ్డి చాగంటితో కలిసి సిఎంను కలుసుకున్నారు.  సిఎంతో సమావేశం అనంతరం గోశాలను చాగంటి కోటేశ్వరరావు, కే.ఐ. వరప్రసాద్‌ రెడ్డిలు సందర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్