Saturday, April 20, 2024
Homeసినిమామెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్..?

మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్..?

రామ్ చరణ్‌, శంకర్ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. కైరా అద్వానీ చరణ్‌ కు జంటగా నటిస్తుంటే.. శ్రీకాంత్, సునీల్, అంజలి, ఎస్.జె. సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి షూటింగ్ చాలా స్పీడుగా జరిగింది అయితే.. ఇటీవల కాస్త స్లో అయ్యింది.

ఓ వైపు ‘ఇండియన్ 2’, మరో వైపు చరణ్‌ సినిమాను షూటింగ్ చేస్తుండడం వలన స్లో అయ్యింది కానీ.. లేకపోతే ఈపాటికే చరణ్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేది. ఈ మూవీ షూటింగ్ చాలా గ్రాండ్ గా ప్రారంభించారు. ఆతర్వాత నుంచి ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. అయితే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. విషయం ఏంటంటే.. మార్చి 26న ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసి.. చరణ్‌ బర్త్ డే సందర్భంగా మార్చి 27న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ విధంగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారని సమాచారం. ఈ వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులు మరింత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇది పొలిటికల్ ఎంటర్ టైనర్. అందుచేత ఈ చిత్రానికి సర్కారోడు అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో ప్రచారంలో ఉన్న టైటిల్ నే ఫిక్స్ చేస్తారా..? లేక వేరే టైటిల్ పెడతారా..? అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్