Saturday, September 28, 2024
HomeTrending Newsనేడు అవనిగడ్డలో సిఎం పర్యటన

నేడు అవనిగడ్డలో సిఎం పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు.  22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు పరిష్కారం లభించడంతో  ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతులకు క్లియరెన్స్‌ పత్రాలు అందించనున్నారు. దీని ద్వారా 35,600 ఎకరాల భూముల్లో 22 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం జగన్ ప్రసంగించనున్నారు.

ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 10.55 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. 10.55 – 12.25 గంటల మధ్య బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం, అనంతరం నిషేదిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్‌ పత్రాలు రైతులకు అందజేయనున్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్