Wednesday, February 26, 2025
HomeTrending Newsసిఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

సిఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. “కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. ఈ క్రిస్మస్ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు” అంటూ తన సందేశంలో పేర్కొన్నారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్ జిల్లలో ఉన్న సిఎం జగన్ నిన్న ఇడుపులపాయ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నారు.  నేడు పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలకు  కుటుంబ సమేతంగా  జగన్  హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్