Friday, March 29, 2024
HomeTrending Newsపాట్నా చేరుకున్న సిఎం కెసిఆర్

పాట్నా చేరుకున్న సిఎం కెసిఆర్

కొద్దిసేపటి క్రితం పాట్నా చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ …  జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు ఘనస్వాగతం పలికిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.

బీహార్ ముఖ్యమంత్రి తో కలిసి వేదిక మీదికి చేరుకున్న సీఎం కేసిఆర్… గాల్వాన్ అమర సైనికుల కుటుంబాలకు, మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు, చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.

సీఎం కేసిఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి,కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, జాతీయ రైతు సంఘాల నేతలు..తదితరులున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్