Sunday, February 23, 2025
HomeTrending Newsగోల్కొండ కోట‌పై జాతీయ జెండా ఆవిష్క‌రించిన కేసీఆర్

గోల్కొండ కోట‌పై జాతీయ జెండా ఆవిష్క‌రించిన కేసీఆర్

గోల్కొండ కోటపై జాతీయ జెండాను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు. అంత‌కుముందు పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని కేసీఆర్ స్వీక‌రించారు. గోల్కొండ కోట‌లో వెయ్యి మందికి పైగా క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. గోల్కొండ కోట‌కు చేరుకునే ముందు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ జెండా ఎగుర‌వేసి, సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌కు కేసీఆర్ చేరుకున్నారు. అక్క‌డ అమ‌ర జ‌వానుల స్మృతి చిహ్నం వ‌ద్ద కేసీఆర్ నివాళుల‌ర్పించారు. స్వ‌తంత్ర భార‌త స్వ‌ర్ణోత్స‌వ వేళ‌.. భార‌త స్వాతంత్ర్యోద్యమ అమర వీరుల త్యాగాలను కేసీఆర్ స్మ‌రించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్