Sunday, February 23, 2025
HomeTrending Newsమణిపూర్లో జేడీయూకు ఎదురు దెబ్బ

మణిపూర్లో జేడీయూకు ఎదురు దెబ్బ

మణిపూర్‌లోని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు శుక్రవారం అధికార బిజెపిలో చేరారు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరిన నేపథ్యంలో.. జేడీయూ శాసనపక్షాన్ని.. భాజపాలో విలీనం చేస్తున్నట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి కె. మేఘజిత్ సింగ్ ప్రకటించారు. వీరికి పార్టీ ఫిరాయింపులు చట్టం వర్తించదన్నారు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేసిన 38 నియోజకవర్గాల్లో ఆరు గెలుచుకుంది. బీజేపీలో చేరిన  వీరిలో మాజీ డీజీపీ ఏఎం ఖౌటే, తంగ్జామ్ అరుణ్ కుమార్, ఖజాయ్‌కిషన్, ఎన్ సనాతే, ఎండీ అచాబ్ ఉద్దీన్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏఎం ఖౌటే, అరుణ్‌ కుమార్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నుంచి టికెట్ ఆశించారు. అయితే భాజపా వారికి టికెట్ ఇవ్వకపోవడం వల్ల జేడీయూ నుంచి ఎన్నికల బరిలో దిగి గెలుపొందారు. కొన్ని రోజుల క్రితం అరుణాచల్​ ప్రదేశ్​లో జేడీయూకు ఉన్న ఏకైక శాసనసభ్యుడు భాజపాలో చేరారు.

Also Read : పాట్నా టూర్ పట్టెంత! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్