Tuesday, September 17, 2024
Homeసినిమాఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారిని అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాలి - బాల‌కృష్ణ

ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారిని అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాలి – బాల‌కృష్ణ

ఎల్.విజయలక్ష్మి బాల నటిగా సిపాయి కూతురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తరువాత, ‘జగదేకవీరుని కథ’, ‘ఆరాధన’, ‘గుండమ్మ కథ’, ‘నర్తన శాల’, ‘పూజా ఫలం’, ‘బొబ్బిలి యుద్ధం’,’ రాముడు – బీముడు’, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించి ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి, 50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో సుమారు 15 సినిమాలకు పైగా తను నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోయారు. 50 సంవత్సరాల తర్వాత మొదటి సారిగా తెనాలిలో జరుగుతున్న, లెజెండరీ నటుడు,యన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆమెకు అవార్డు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఆమెను వ్య‌క్తిగ‌తంగా క‌లిసి అభినంద‌న‌లు తెలపాల‌ని బాల‌కృష్ణ భావించారు. అందులో భాగంగా సినీ ప్ర‌ముఖులు స‌మ‌క్షంలో నంద‌మూరి బాల‌కృష్ణ ఎఫ్‌.ఎన్‌.సి.సి.లో ఆమెకు గౌర‌వ స‌త్కారం చేశారు.

అనంత‌రం నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ… శ‌క‌పురుషుడి శ‌తాబ్డి పుర‌స్కార గ్రహీత ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారికి శిర‌స్సు వ‌చ్చి వంద‌నాలు స‌మ‌ర్పిస్తున్నాను. 60 ద‌శ‌కంలో చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ముందుకు న‌డిపిన‌ అతిర‌థులు నిర్మించిన చిత్రాల్లో ఆమె న‌ట‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగించారు. ఈ సంద‌ర్భంగా సురేష్‌బాబు, త‌మ్మారెడ్డి, ప‌రుచూరిగోపాల‌కృష్ణ‌, బ‌సిరెడ్డి వంటి వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. అస‌లు శ‌క‌పురుషుడి శ‌తాబ్డి ఉత్స‌వాలకు అంకురార్ప‌ణ చేసింది కొమ్మినేని వెంక‌టేశ్వ‌ర‌రావు, బుర్రా సాయిమాధ‌వ్‌, ఆల‌పాటి రాజా, వైవి.ఎస్. చౌద‌రి వంటి వారు ముందుండి న‌డిపారు. న‌న్ను గౌర‌వాధ్య‌క్షునిగా పెట్టి తెనాలిలో ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం గొప్ప విష‌యం. సినిమాలేకాక అటు రాజ‌కీయ‌, ప్ర‌జా సేవ రంగంలో కూడా సేవ‌లు చేసిన వారిని స‌త్క‌రించుకొనే మ‌హ‌త్క‌ర కార్య‌క్ర‌మం ఇది. అందులో భాగంగా విజ‌య‌ల‌క్ష్మిగారికి ఇవ్వ‌డం జ‌రిగింది.

ఇక చ‌రిత్ర పుట‌ల్లోకి వెళితే ఎర్నాకుళంలో పెట్టి నాట్యం నేర్చుకుని 59 నుంచి 69వ‌ర‌కు ప‌దేళ్ళ సుదీర్ఘ ప్ర‌యాణం సినిమారంగంలో చేశారు. వంద‌కు పైగా సినిమాల్లో న‌టిస్తే అందులో 60కి పైగా నాన్న‌గారితో న‌టించారు. నాట్యంలో ప‌లువురు న‌టీమ‌ణులు వున్నా, ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారు కూచిపూడి, భ‌ర‌త‌నాట్యం, క‌థాక‌ళి, జావ‌లి వంటి ఎన్నో నాట్యాలు ప్ర‌ద‌ర్శించారు. అలా క‌ళామ‌త‌ల్లి సేవ చేశారు. ముఖ్యంగా న‌టీన‌టులు ఒక స్థాయికి చేరుకున్నాక సినీ ప్ర‌యాణం ఆగిపోతే ఒంట‌రిత‌నానికి గురికావ‌డం స‌హ‌జం. కానీ ఆమె నాన్న‌గారిని స్పూర్తిగా తీసుకుని అమెరికా వెళ్ళి సి.ఎ. చ‌దివి వ‌ర్జీనియా యూనిర్శిటీలో బ‌డ్జెట్ మేనేజ‌ర్‌గా వుండ‌డం విశేషం. ఇప్పుడు జూంబా డాన్స్ కూడా నేర్చుకుంటున్నారు. మ‌నిషికి ప‌ని లేకుండా ఖాళీగా వుంటే రోగం. ఆమె మ‌హిళా సాధికారిక‌త‌కు ప్ర‌తీక‌. ఆమె ఎక్కిన‌ మెట్లును భావిత‌రాలు ఆద‌ర్శంగా తీసుకోవాలి. ఆవిడ‌ను ఇక్క‌డ‌కు తీసుకు వ‌చ్చేలా చేసిన వైవిఎస్‌. చౌద‌రికి ధ‌న్య‌వాదాలు తెఇయ‌జేస్తున్నా అన్నారు.

ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారు మాట్లాడుతూ.. ఎంతో అభిమానంతో న‌న్ను పిలిపించి గౌర‌వించ‌డం చూస్తుంటే క‌ళ్ళు చెమ‌ర్తున్నాయి. మీరంతా చాలా ద‌య‌తో, ప్రేమ‌తో న‌న్ను ఇక్క‌డికి ర‌ప్పించినందుకు బాల‌కృష్ణ‌ గారికి ఆల‌పాటి రాజా, బుర్ర‌సాయిమాధవ్ గారికి ధ‌న్య‌వాదాలు. నేను చిన్న‌త‌నం  నుంచి రామారావుగారిని ఆద‌ర్శంగా తీసుకునేదానిని. ఆయ‌న‌తో న‌టించేట‌ప్పుడు మొద‌ట చాలా భ‌య‌మేసేది. పెద్ద హీరో అని ఫీలింగ్ ఉండేదికాదు. ఆయ‌న‌తో న‌టించేట‌ప్పుడు చాలా విలువ‌లు నేర్చుకున్నాను. క్ర‌మ‌శిక్ష‌ణ‌, మాట‌తీరు, సిన్సియారిటీ, చెప్పిందే చేయ‌డం, అంకిత భావం, నిబద్ధ‌త వంటి విష‌యాలు గ్ర‌హించాను. సినిమాలు అయ్యాక నేను ఎడ్యుకేష‌న్ చేశానంటే ఎన్‌.టి.ఆర్‌.స్పూర్తి వ‌ల్లే జ‌రిగింది. అప్ప‌టి రామానాయుడుగారు త‌రం, ఎన్‌టిఆర్‌. త‌రం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా వుంది. మ‌ర‌లా ఇలాంటి ఫంక్ష‌న్‌ల‌కు రావాల‌నుంది అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్