Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్Hylo Open-2022: సెమీస్ కు శ్రీకాంత్; గాయత్రి-త్రెసా జోడీ

Hylo Open-2022: సెమీస్ కు శ్రీకాంత్; గాయత్రి-త్రెసా జోడీ

బాడ్మింటన్ హైలో ఓపెన్-2022లో భారత ఆటగాళ్ళు కిడాంబి శ్రీకాంత్, త్రెసా జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ సెమీస్ కు చేరుకున్నారు.

మహిళల డబుల్స్ విభాగంలో త్రెసా జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్లో తైవాన్ కు చెందిన యా చింగ్- వాన్ చింగ్ జోడీపై పై 21-17; 18-21; 21-8 తేడాతో గెలుపొందారు.

పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్ పై 21-13;21-19 తేడాతో ఇండోనేషియా ఆటగాడు జోనాటన్ క్రిస్టీ పై విజయం సాధించాడు.

కాగా, మహిళల సింగిల్స్ లో మాల్విక బన్సోద్ పై ఇండోనేషియా క్రీడాకారిణి గ్రేగోరియా మరిష్కా 21-17;21-10 తేడాతో విజయం సాధించింది.

పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ 21-17;21-14 తో ఇంగ్లాండ్ జోడీ బెన్ లేన్- సీన్ వెండీ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Also Read : Hylo Open-2022:  క్వార్టర్స్ కు శ్రీకాంత్, బన్సోద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్