Sunday, September 8, 2024
HomeTrending Newsబిజెపి దత్తపుత్రిక షర్మిల - గుత్తా విమర్శ

బిజెపి దత్తపుత్రిక షర్మిల – గుత్తా విమర్శ

తెలంగాణ రాష్ట్రంపై సమైఖ్య వాదులు కుట్ర పన్నుతున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. గత సంవత్సర కాలంగా రాష్ట్రములో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం,ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలనే కొన్ని జాతీయ పార్టీల కుట్రగా కనిపిస్తుందన్నారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడిన అంశాలు

గవర్నర్ వ్యవహార శైలి, బి‌జే‌పి దత్త పుత్రిక షర్మిలా పాదయాత్ర ,బండి సంజయ్ పాదయాత్ర ,చంద్రబాబు నాయుడు అనుచరుడు మరో జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యుడు ఉపన్యాసములు, ED,CBI దాడులు ,MLA ల కొనుగోలు వ్యవహారం ఇవ్వన్ని కూడా సమైక్య వాదుల కుట్రలో బాగంగా కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికే విఘాతం కలిగిస్తున్న తీరును చూసి యావత్ తెలంగాణ ప్రజానీకం మేలుకోవాల్సిన సమయం వచ్చింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అలాంటి ఘటనలు పునారావృత్తం కాకుండ,మత విద్వేషాలు జరగకుండా శాంతియుతంగా, ప్రశాంతంగా మనం జీవించాలంటే కుట్రలను తిప్పికొట్టాలి.

ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి ద్యేయంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సోదర భావంతో జీవిస్తున్నారు. కానీ రాష్ట్రములో విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టె విధంగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉండటం విచారకరం. ఒక్క KCR ని, ఆయన కుటుంబాన్ని రాజకీయముగా అడ్డు తొలగించుకుంటే తెలంగాణను ఆక్రమించుకోవచ్చునని సమైక్య వాదులకుట్ర. 2014లో బిజెపి కేంద్రంలో అధికారంలోకి రాగానే మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 మండలాలను ,సిలేరు పవర్ ప్రాజెక్టు ను ఏపీ రాష్ట్రములో కలిపి తెలంగాణ రాష్టానికి తీరని అన్యాయం చేసింది.ఆ రోజు నుండి నేటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవితి ప్రేమ చూపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బతీయలనే కుట్రతో ,రాష్టానికి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త,పోరాడి ,కొట్లాడి ఎన్నో బాధలకు తట్టుకొని సాధించుకున్న తెలంగాణ రాష్టాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇది. ఒక్కసారి మళ్ళీ సమైఖ్య వాదుల చేతిలోకి వెళితే కుట్రదారులు మన రాష్టాన్ని అన్ని విధాలుగా అస్తవ్యస్తం చేస్తారు. తెలంగాణ ప్రజలు,మేధావులు, విద్యార్ధి లోకం అందరూ కూడా కెసిఆర్ కి అండగా ఉండి ,సమైక్య వాదులకు తగిన గుణపాఠం చెప్పాలి. తెలంగాణ రాష్టాన్ని కాపాడుకుందాం రాష్ట్ర ప్రగతిని కొనసాగిద్దాం. బిజెపి దత్తపుత్రిక షర్మిల అవినీతి పై మాట్లాడటం విడ్డురంగా ఉంది.అధికారంలో ఉన్నప్పుడు భారీ అవినీతికి పాల్పడి ,జైళ్లకు వెళ్ళింది ఆమె కుటుంబ సభ్యులు.వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళతో పాటు అధికారులను కూడా జైళ్ల చుట్టూ తిరిగేలా చేసింది ఆమె కుటుంబ సభ్యులు.

Also Read : తెలంగాణపై కేంద్రం వివక్ష గుత్తా సుఖేందర్ రెడ్డి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్