Wednesday, April 17, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: హర్యానా, బెంగుళూరు, గుజరాత్ విజయం

ప్రొ కబడ్డీ: హర్యానా, బెంగుళూరు, గుజరాత్ విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మూడు మ్యాచ్ ల్లో యూ ముంబాపై హర్యానా స్టీలర్స్; రాజస్థాన్ పింక్ పాంథర్స్ పై బెంగుళూరు బుల్స్; యూపీ యోధపై గుజరాత్ విజయం సాధించాయి.

హర్యానా స్టీలర్స్- యూ ముంబా మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో 37-26తో హర్యానా విజయం సాధించింది. ప్రథమార్ధంలో 18-13తో ఆధిక్యం సంపాదించిన హర్యానా ద్వితీయార్ధంలోనూ అదే ఆటతీరు ప్రదర్శించి 19-13 తో పైచేయి సాధించింది. మ్యాచ్ ముగిసే నాటికి ముంబై పై 9 పాయింట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. హర్యానా కెప్టెన్ వికాస్ ఖండాలా-14; ఆశిష్-13 పాయింట్లతో రాణించి జట్టు విజయంలో తోడ్పడ్డారు.

బెంగుళూరు బుల్స్ – రాజస్థాన్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 45-37 తేడాతో బెంగుళూరు గెలుపొందింది. ఆట తొలి భాగంలో 22-19 తో మూడు పాయింట్ల ఆధిక్యం సంపాదించిన బెంగుళూరు  మలి భాగంలో కూడా సత్తా చాటి 23-18తో ముందంజలో నిలిచింది. దీనితో మ్యాచ్ ముగిసే నాటికి 8 పాయింట్ల తేడాతో బెంగుళూరు విజయం సాధించింది. జైపూర్ రైడర్  అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. బెంగుళూరులో భరత్-15, కెప్టెన్ పవన్ షెరావత్-10 పాయింట్లతో రాణింఛి జయంలో తమవంతు పాత్ర పోషించారు.

గుజరాత్ జెయింట్స్- యూపీ యోధ  జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్ లో 38-31 తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఆట ప్రథమార్ధంలోనే 24-12 తో గుజరాత్ భారీ ఆధిక్యం సంపాదించింది. ద్వితీయార్ధంలో పుంజుకున్న యూపీ 19-14తో కొంత పైచేయి సాధించినప్పటికీ తొలి భాగంలో గుజరాత్ సాధించిన ఆధిక్యాన్ని అందుకోలేకపోయింది. దీనితో మ్యాచ్ ముగిసే సమయానికి ఏడు పాయింట్ల యూపీ ఓటమి పొందాల్సి వచ్చింది. గుజరాత్ ఆటగాళ్ళు సమిష్టి గా రాణించగా, యూపీ  రైడర్ ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లు సంపాదించాడు.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… పాట్నా పైరేట్స్ (70 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (65); హర్యానా స్టీలర్స్(63); బెంగుళూరు బుల్స్ (60); యూపీ యోధ (58); గుజరాత్ జెయింట్స్ (54) టాప్ సిక్స్ లో ఉన్నాయి.

Also Read : ప్రొ కబడ్డీ: ఢిల్లీ, ముంబై, పూణే విజయం   

RELATED ARTICLES

Most Popular

న్యూస్