Friday, March 29, 2024
HomeTrending Newsతెలంగాణలో సెలవులు..ఏపీలో క్లాసులు ???

తెలంగాణలో సెలవులు..ఏపీలో క్లాసులు ???

ఆరు నుంచి పది లక్షల కేసులు ఉన్న అమెరికా లో విద్య సంస్థలు పని చేస్తున్నాయి. రెండు నుంచి మూడు లక్షల కేసులున్న ఫ్రాన్స్ , ఇంగ్లాండ్ లాంటి యురోపియన్ దేశాల్లో కూడా విద్య సంస్థలను మూయ లేదు.

దీనికి కారణం.

1 . చదువు ప్రాధాన్యత ఆ దేశాలకు బాగా తెలుసు. ఆన్లైన్ వల్ల పరిమిత ఉపయోగం అని వారికి తెలుసు. 2. ప్రారంభం నుంచి కూడా కరోనా పిల్లల పై ప్రభావం బాగా తక్కువగా చూపుతోందని అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు , డాక్టర్ లు చెప్పారు. కానీ మన దేశం లో పరిస్థితి వేరు .. కరోనా మూడో వేవ్ పిల్లలకే సోకనుందని గత ఆరునెలలుగా బూటకపు ప్రచారం హోరెత్తింది. ఓమిక్రాన్ వల్ల పిలల్లు కాదు కదా కనీసం పెద్దలు కూడా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేని స్థితి నేడు కనిపిస్తోంది. పోనీ ఓమిక్రాన్ నెలకో రెండు నెలలకో పోతుందా అంటే లేదు… అది ఎండెమిక్ అవుతుంది. అంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతుంది. అంటే ఓమిక్రాన్ కు భయపడి విద్యాసంస్థల్ని మూసేయాల్సి వస్తే అది నెలకో సంవత్సరానికో పరిమితం కాదు. వందేళ్లు లేదా అంత కంటే ఎక్కువ కాలం మోసేయ్యాలి.

బహుశా తల్లి తండ్రుల్లో ఉన్న భయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం సెలవుల్ని జనవరి చివరి దాక పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. కరోనా మొదటి వేవ్ రెండో వేవ్ ల మధ్య పాఠశాలల్ని నడిపిన ఒకే ఒక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. ఇప్పుడు కూడా సెలవుల్ని పొడిగించకుండా రేపటి నుంచి అంటే 17 జనవరి నుంచి పాఠశాలల్ని పునః ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది జరిగితే నిజం గా అది గొప్ప నిర్ణయం అవుతుంది. పిల్లల్ని ఎన్ని రోజులు పాఠశాలకు దూరం చేస్తే అంత నష్టం. నష్టం పాఠశాల యాజమాన్యాలకు కాదు. పిల్లలకు.. వారి తల్లి తండ్రులకు.. పిల్లల బాల్యం, వారి బతుకు ఇప్పటికే నాశనం అయ్యింది. ఓమిక్రాన్ వచ్చాక కూడా పాఠశాలలు మూయడం సరి కాదు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్ని తెరవాలి అని నిర్ణయిస్తే అభినందనలు తెలపాలి. కేసులకు భయపడి పిల్లల్ని పాటశాలకు పంపడానికి జంకుతున్న తల్లి తండ్రులకు ఆన్లైన్ చదువు మరి కొంత కాలం కొనసాగించవచ్చు. ఎవరి పైనా ఒత్తిడి వద్దు. అదే సమయంలో జనాలకు వాస్తవాలు చెప్పాలి. భయాన్ని వ్యాపింప చేసి వారి జీవితాల్ని నాశనం చెయ్యాలని చూస్తున్న వారి బాగోతాన్ని బహిర్గతం చెయ్యాలి. ఇది రాజకీయ సమస్య కాదు. విద్య సంస్థల విషయాన్ని అందరూ రాజకీయాలకు అతీతంగా చూడాలి.

ఇక తెలంగాణ విషయానికి వస్తే .. ఫిబ్రవరి మొదటి వారం నుంచైనా భౌతిక తరగతులు ప్రారంభించాలి. అప్పటిదాకా అంటే జనవరి 30 దాక ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి అకాడమిక్ ఇయర్ ను మే నెల దాక పొడిగించాలి. పిల్లల చదువు దెబ్బ తినకుండా చూసుకోవాలి. నేటి బాలలే రేపటి మన భవిత. బాల్యాన్ని కాపాడండి. తల్లి తండ్రుల్లో అవగాహన తీసుకొని రావాలి. నిర్ణయం వారికే వదిలెయ్యాలి.

Also Read : విద్యాసంస్థల సెలవులు పొడగింపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్