Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: ఓటమితో ముగించిన హైదరాబాద్

ఐపీఎల్: ఓటమితో ముగించిన హైదరాబాద్

Punjab won: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ఈ సీజన్ ఐపీఎల్ ముగించింది.  నేడు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో  పరాజయం పాలైంది. కేన్ విలియమ్సన్ లేకపోవడంతో భువనేశ్వర్ కుమార్ హైదరాబాద్ కు కెప్టెన్ గా  వ్యవహరించాడు.

ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  అభిషేక్ శర్మ -43, రోమానియో షెఫర్డ్ -26, వాషింగ్టన్ సుందర్-25, రాహుల్ త్రిపాఠి -20 పరుగులు చేశారు.  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

పంజాబ్ బౌలర్లలో హర్  ప్రీత్ బ్రార్ , నాథన్ ఎల్లీస్… చెరో 3;  రబడ ఒక వికెట్ పడగొట్టారు.

ఆ  తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 15.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. లివింగ్ స్టోన్ 22 బంతుల్లో  2 ఫోర్లు, 5 సిక్సర్లతో 49 పరుగులతో నాటౌట్ గా  నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.  శిఖర్ ధావన్ 39, బెయిర్ స్టో -23 ; జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్ చెరో 19 పరుగులు చేశారు.

హైదరాబాద్ బౌలర్లలో ఫారూఖి 2; వాషింగ్టన్ సుందర్, జగదీశ సుచిత్, ఉమ్రాన్  మాలిక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

హర్ ప్రీత్ బ్రార్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్