Thursday, March 28, 2024
HomeTrending Newsఉగ్రవాదులకు హైదరాబాద్ సేఫ్ జోన్ ?

ఉగ్రవాదులకు హైదరాబాద్ సేఫ్ జోన్ ?

హైదరాబాద్ సేఫ్ జోన్.. చాలా సురక్షితమైన ప్రాంతం..! ఇది ప్రజలకు అనుకుంటే తప్పులో కాలేసినట్టే..! హైదరాబాద్ అనేది నేరగాళ్లకు… ఉగ్రవాదులకు… దేశ వ్యతిరేకులకు స్థావరం.! దేశంలో ఎక్కడైనా దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడి హైదరాబాదులో తలదాచుకుంటే స్వర్గధామమే..!! వారిని అడిగేవాడు, పట్టుకునేవాడు అస్సలు ఉండడు..!

దేశంలో ఎక్కడైనా ఎవరినైనా హత్యలు చేసి వచ్చి, ప్రశాంతంగా గుండెపై చేయి వేసుకొని నిద్రపోవచ్చు. ఏ అలజడి ఆందోళన లేకుండా దర్జాగా జీవించవచ్చు. ఇది కావాలని విమర్శించే ప్రయత్నం కాదు. వ్యంగ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం అంతకన్నా కాదు. వాస్తవ సంఘటనలు పోలీసుల ఆధారంగా రుజువు చేస్తున్నాయి.

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్ లోని కన్నయ్య లాల్ హత్య కేసులో నిందితులు, హంతకులు వచ్చి హైదరాబాద్ లో ప్రశాంతంగా జీవించారు. బిజెపి మాజీ నేత నూపూర్ శర్మ తలను నరికి తీసుకువస్తే నజరానా ఇస్తానంటూ ప్రకటించిన రాజస్థాన్ లోని ఓ ప్రముఖ మసీదు అధినేత అక్కడి పోలీసుల కళ్ళు కప్పి వచ్చి హైదరాబాదులో  తలదాచుకున్నాడు. ఇప్పుడేమో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సంచలనం సృష్టించిన పోలీసు అధికారి (ఇంటెలిజెన్స్ బ్యూరో) అంకిత్ శర్మ హత్య కేసులో నిందితుడు మూసా హైదరాబాదులో దర్జాగా తిరుగుతున్నాడు. అతని భార్య విజయవాడలోని ఓ బ్యూటీ పార్లర్ లో పనిచేస్తూ పోలీసులకు చిక్కకుండా ధీమాగా ఉన్నారు.
ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాదు, మీర్ పేట లోని గాయత్రి నగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న మూసా… మేకల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. దాదాపు మూడేళ్లుగా ఢిల్లీ పోలీసుల కళ్లుగప్పి హైదరాబాదులో విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు.

2020 సంవత్సరంలో ఢిల్లీ మహానగరంలోని చాంద్ బాగ్ లో జరిగిన హిందూ – ముస్లిం గొడవలో హిందువులను టార్గెట్ చేసి చాలా మంది ఇళ్లను తగలబెట్టారు. వందల సంఖ్యలో హత్యలు చేశారు. ఒక హిందువుల స్కూలుకు నిప్పు పెట్టి బుగ్గిపాలు చేశారు. ఈ ప్రాంతంలో హిందువులు ఎవరు ఉండకూడదు అంటూ హెచ్చరికలు చేసి భయభ్రాంతులను సృష్టించారు. అక్కడినుంచి అందరూ పారిపోయే విధంగా కత్తులతో స్వేర విహారం చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోకి వెళ్లిన అంకిత్ శర్మ అనే ఇంటిలిజెన్సీ బ్యూరో పోలీస్ ఆఫీసర్ ను ఘోరంగా చంపేశారు. దాదాపు 237 కత్తి గాట్లతో శరీరాన్ని జల్లెడ మాదిరి కసితీరా తూట్లు పొడిచారు. తర్వాత ఎవరికి అనుమానం రాకుండా శరీరాన్ని మురుగుకాలవలో పడవేశారు. డ్రైనేజీ సిబ్బంది కాలువ శుభ్రం చేసే సందర్భంలో అంకిత్ శర్మ మృత దేహాన్ని గుర్తించి వెలికి తీశారు. అశరీరాన్ని పోస్టుమార్టం పంపితే 237 ఘట్లతో శరీరం జల్లెడ పడిందని పోస్టుమార్టం నిర్వహించే వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ జీవితంలో ఇటువంటి మర్డర్ ను ఎప్పుడు చూడలేదని.. ఆశ్చర్య వ్యక్తం చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ ముఖ్య అనుచరుడు, అక్కడి స్థానిక కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్ ఈ అల్లర్లకు నేతృత్వం వహించాడు. ఒక వర్గం ప్రజలపై రాళ్ల వర్షం కురిపించాడు. పెట్రోల్ బాంబులు విసిరాడు. ఈ దెబ్బతో ఆ ఏరియాలో ఉన్న  ఒక వర్గం ప్రజలు తమ ఇళ్లు ఖాళీ చేసి పారిపోవాలని భయానక వాతావరణం సృష్టించాడు.

మొత్తంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే హైదరాబాద్ అనేది ఉగ్రవాదులకు స్థావరంగా మారింది. ఎందుకంటే ఇటీవల కాలంలో పిఎఫ్ఐ కార్యకలాపాలు రాష్ట్ర మొత్తం విస్తరించిన కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా లేదు. దీనికి తోడు దేశం మొత్తం నిషేధించిన ఒక వర్గం వ్యతిరేకి కమెడియన్ మునావర్ ఫారుకి షో ను తెలంగాణ ప్రభుత్వం వేలాది పోలీసుల భద్రత మధ్య నిర్వహించటం విమర్శలకు దారితీస్తోంది.

దేశంలో ఎక్కడ జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా.. వాటి మూలాలు మాత్రం హైదరాబాదులో లభించడం ప్రజలను, నిఘా వర్గాలను కలవర పరుస్తోంది.

Also Read : హైదరాబాద్ కు గ్రీన్ సిటి అవార్డు సిఎం హర్షం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్