Saturday, July 27, 2024
HomeTrending Newsకెసిఆర్ కు జెడిఎస్ సంపూర్ణ మద్దతు - కుమారస్వామి

కెసిఆర్ కు జెడిఎస్ సంపూర్ణ మద్దతు – కుమారస్వామి

దళితుల పట్ల రైతుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కి వున్న కమిట్ మెంట్ గొప్పదని జెడిఎస్ నేత కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి అన్నారు. కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణ లో విజయం సాధించారన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఈ రోజు జరిగిన తెరాస సమావేశంలో జెడిఎస్ నేత కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి గా మార్పు చేయటంపై కుమారా స్వామి హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కుమార్ స్వామి మాట్లాడుతూ… కెసిఆర్ పోరాట పటిమ.. తెలంగాణ ప్రస్తానం తదితర అంశాల్ని ప్రస్తావించారు. కుమార స్వామి ప్రసంగం ..ముఖ్యాంశాలు :

తెలంగాణ కోసం మీరు ఎంతగా పోరాటం చేశారో మాకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా వున్నారు. అదే పద్దతిలో దేశ వ్యాప్తంగా కూడా మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. తెలంగాణను అభివృద్ధి చేయాలనే మీ కలలను సాకారం చేసుకున్నారు. మీరు దేశాభివృద్దిని సవాలుగా తీసుకున్నారు. మీ హృదయాంతరాల్లోంచి సాగిన ప్రసంగంలో పేదలు బడుగు బలహీన వర్గాల పట్ల మీకున్న నిబద్దతను తెలియజేసింది. దళితులు మరియు రైతుల అభివృద్దిని తెలంగాణలో పెద్ద ఎత్తున మీరు సాధించారు. ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం దేశ నిర్మాణం కోసమే కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా విస్తరించాలని కోరుకున్నారు.

దేశాభివృద్ధి కోసం మీరు కంటున్న పారదర్శక కల సాకారం కావాలని కోరుకుంటున్నాను. కేసీఆర్, దేశ నిర్మాణానికి అవసరమైన విజనరీ లీడర్, ఛాలెంజింగ్ లీడర్, లిజెండరీ లీడర్. తెలంగాణ లో విజయవంతమైన మీ పనితీరును మీరు గమనిస్తున్నాము. మీరు విజయం సాధించారు. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. కేంద్రంలో గత ఏడేండ్ల కాలంలో అధికార దుర్వినియోగం జరుగుతున్నది. దానికి గట్టి సమాధానం చెప్పేందుకు కెసిఆర్ నిర్ణయించుకున్నారు.
అయితే అది రాజకీయ ప్రతీకార భావనతో కాకుండా అభివృద్ధి ద్వారా, దేశ ప్రజల విశ్వాసాన్ని పొందడానికి సిఎం కెసిఆర్ చేస్తున్న కృషికి మా మద్దతుంటుంది. మీరు మీ భవిష్యత్ రాజకీయ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.’’ అని కుమార స్వామి అన్నారు

Also Read టిఆర్ఎస్ ఇక భారత రాష్ట్ర సమితి

RELATED ARTICLES

Most Popular

న్యూస్