Sunday, September 22, 2024
Homeస్పోర్ట్స్36th National Gamesh: జ్యోతి, ఇషా సింగ్ లకు స్వర్ణ పతకాలు

36th National Gamesh: జ్యోతి, ఇషా సింగ్ లకు స్వర్ణ పతకాలు

గుజరాత్ లో జరుగుతోన్న 36వ జాతీయ క్రీడల్లో  తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు సత్తా చాటారు. నిన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన యార్రాజి జ్యోతి 100 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించగా, తెలంగాణా  షూటర్ ఇషా సింగ్ 25 మీటర్ల ఈవెంట్ లో విజేతగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్  క్రీడాకారులు  దండి జ్యోతికశ్రీ  400 మీటర్ల  పరుగు పందెంలో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. వెయిట్లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో కే.నీలంరాజు రజత పతకం సాధించాడు.   భావనగర్ లోని ఎస్.సి.బి . అవుట్ డోర్ స్టేడియం లో జరిగిన బాస్కెట్ బాల్ పోటీలో ఆంధ్ర ప్రదేశ్ జట్టు 20 -18 పాయింట్ల తేడాతో కేరళను ఓడించింది.
తెలంగాణకు చెందిన కాంతిశ్రీ- జూహిత్ లు రోలర్ స్కేటింగ్ కపుల్ డాన్స్ ఈవెంట్ లో కాంస్యం పతకం దక్కించుకున్నారు,
RELATED ARTICLES

Most Popular

న్యూస్