Friday, March 29, 2024
HomeTrending Newsఢిల్లీ లిక్కర్ తో... బేగంపేట ఎయిర్ పోర్టుకు లింక్

ఢిల్లీ లిక్కర్ తో… బేగంపేట ఎయిర్ పోర్టుకు లింక్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో త్వరలోనే మరిన్ని సంచలనాలు వెలుగు చూడనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖుల మెడకు లిక్కర్ స్కామ్ ఉచ్చు చుట్టుకుంది. ఇప్పటికే దర్యాప్తు సంస్థల వద్ద అత్యంత కీలక ఆధారాలు ఉన్నాయని, అతి త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిసింది.  బేగంపేట ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ లేకపోవడం, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ చేతిలో ఎయిర్ పోర్ట్ ఉండడంతో నేరుగా రన్ వే పైకి వీఐపీల వాహనాలు..! వీఐపీలతో కలిసి డబ్బు తరలించిన లిక్కర్ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులు..! పలువురు రాజకీయ నేతల పాత్ర నిగ్గు తేల్చే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకో మలుపు చోటుచేసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో కంపెనీలో డైరెక్టర్ గా కొనసాగుతున్న శరత్ చంద్రారెడ్డిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శరత్ చంద్రారెడ్డి అర్ధాంగి కనికా రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న జెట్ సెట్ గో ఎయిర్ లైన్స్ కంపెనీకి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని ఈడీ కోరిన విషయం బుధవారం వెలుగు చూసింది. కనికా రెడ్డికి అభిషేక్ బోయినపల్లికి దగ్గర సంబంధాలు..! – జెట్ సెట్‌గో సంస్థ కార్యకలాపాలు, లావాదేవీల డేటా సేకరించిన ఈడీ…స్పెషల్ ఫ్లైట్స్ లో వెళ్లిన వారి జాబితా ఈడీ చేతికి చేరింది.

జెట్ సెట్ గో పేరిట ఓ కంపెనీని ఏర్పాటు చేసిన కనికారెడ్డి ప్రైవేట్ చార్టర్డ్ విమానాలను నడుపుతున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఈ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో చేతులు మారిన ముడుపులు కనికారెడ్డికి చెందిన జెట్ సెట్ గో విమానాల్లోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీ తరలినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కంపెనీకి చెందిన విమానాల రాకపోకలు, ఆ విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలను ఇవ్వాలంటూ ఏఏఐకి ఈడీ గత నెల 17ననే లేఖ రాసిందని సమాచారం. ఈ లేఖకు సరిపడ సమాచారాన్ని ఇప్పటికే ఈడీ అధికారులకు ఏఏఐ అందించినట్లు సమాచారం.

ఈ వివరాల ఆధారంగానే శరత్ చంద్రారెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కనికారెడ్డి కంపెనీ విమానాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతల అండతో పెద్ద ఎత్తున నగదును ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించినట్లుగా కూడా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, త్వరలోనే ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశాలున్నట్లు విశ్లేషణలు సాగుతున్నాయి.

Also Read : ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలుగు ఐఏఎస్ ? 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్