Thursday, September 19, 2024
Homeసినిమా కార్తీక్ రాజు కొత్త సినిమా ప్రారంభం

 కార్తీక్ రాజు కొత్త సినిమా ప్రారంభం

కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరో హీరోయిన్లుగా దండమూడి బాక్సాఫీస్, సాయి స్ర‌వంతి మూవీస్ ప్రొడక్షన్ నెం. 2 లాంఛ‌నంగా ప్రారంభమైంది. అంజీ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో దండమూడి అవనింద్ర కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత అవనింద్ర కుమార్ క్లాప్ కొట్టారు. సింగ‌ర్ మ‌నో కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఆకాష్ పూరి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత భాస్క‌ర భ‌ట్ల స్క్రిప్ట్‌ను అందించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత దండ‌మూరి అర‌వింద్ కుమార్ మాట్లాడుతూ.. దండ‌మూడి బాక్సాఫీస్ ప్రొడ‌క్ష‌న్ నెం.2 పూజా కార్యక్రమాలు జరిగాయి. సినిమాను ప్రారంభించాం. ఈ మూవీని హైద‌రాబాద్‌, బ్యాంకాక్, పుకెట్ స‌హా ప‌లు ప్రాంతాల్లో చిత్రీక‌రించ‌టానికి స‌న్నాహాలు చేశాం. 35-40 రోజుల్లో మూవీ షూటింగ్‌ను పూర్తి చేయాల‌నేది మా ప్లాన్‌. అంద‌రూ మా యూనిట్‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాం అన్నారు.

హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ.. దండ‌మూడి బాక్సాఫీస్ ప్రొడ‌క్ష‌న్‌లో మూవీ చేస్తున్నాను. ఈరోజునే ప్రారంభ‌మైంది. నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ల‌వ్‌, యాక్ష‌న్‌, క్రైమ్ డ్రామా ఇది. అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కొత్త‌గా ఉంటుంది. డిఫరెంట్ స్క్రిప్ట్ అని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. మంచి టీమ్ కుదిరింది. మంచి సినిమాతో మీ ముందుకు వ‌స్తాం అన్నారు.

Also Read: ఆకాష్ పూరి క్లాప్ తో ప్రారంభమైన మహీంద్ర పిక్చర్స్ చిత్రం

RELATED ARTICLES

Most Popular

న్యూస్