Sunday, September 22, 2024
Homeసినిమాఇన్నేళ్ల మా కష్టం ఫలించింది : హీరో కార్తీక్ సాయి

ఇన్నేళ్ల మా కష్టం ఫలించింది : హీరో కార్తీక్ సాయి

కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ, డాలీషా, నేహా దేశ్‌పాండే హీరోయిన్స్ గా  చిన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కార్తీక్’స్ ది కిల్లర్’.  శ్రీమతి లలిత సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు యాదవ్ & సంకినేని వాసుదేవరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 3న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సందర్బంగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.

కార్తీక్ సాయి మాట్లాడుతూ “మా సక్సెస్ లో అందరు ఉన్నారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇది నా పదేళ్ల కష్టం. దాన్ని ఈ రోజు నిజం చేశారు. ఈ కరోనా సమయంలో ఏ థియటర్స్ లో హౌస్ ఫుల్ లేదండి.. నా సినిమానే కాదు ఎవరి సినిమా అయినా ఫుల్స్ లేవు.. కానీ ఈ వారంలో విడుదలైన సినిమాల్లో మా సినిమాకు కలక్షన్స్ బాగున్నాయి. రెస్పాండ్ బాగుంది. సినిమా చుసిన వారంతా కొత్తవాళ్లు తీసినట్టు లేదు అని అంటున్నారు . ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం థియటర్స్ పెరిగాయి. ఈ ఆనందంతో పడుకుని ఐదు రోజులైంది. ఈ సినిమా విషయంలో నెగిటివ్ మాట్లాడిన వాళ్లకు గూబ పగిలే సమాధానం వచ్చింది” అన్నారు.

“ఈ సినిమా విషయంలో ఎడిటర్ నాని, లైన్ ప్రొడ్యూసర్ ప్రియా కృషి ఎంతో ఉంది, సినిమా ఇంత బాగా రావడానికి కారణం వాసు గారు.. ఈ సినిమా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక కలిపి 150 కి పైగా థియటర్స్ లో విడుదల చేశాం. అన్ని సెంటర్లలో సినిమాకు మంచి టాక్ వచ్చింది. అది చాలు మాకు. ప్రేక్షకులు సపోర్ట్ తో మరిన్ని మంచి సినిమాలు తీస్తాం. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉంది. అందులో కూడా డాలీషా నే హీరోయిన్, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేసిన సురేష్ కొండేటి గారికి థాంక్స్” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్