Saturday, April 20, 2024
HomeTrending Newsబిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ సిఎం కేసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. అంతకుముందు కార్యాలయ ఆవరణలో జరిగిన రాజశ్యామల యాగంలో నేతలు పాల్గొన్నారు. అనంతరం కేసిఆర్ బిఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి కార్యాలయ ప్రారంభోత్సవాన్ని పూర్తి చేశారు. అనతరం తన ఛాంబర్ లోని కుర్చీలో కూర్చుని ఒకరిద్దరికి పార్టీ పదవుల నియామక ఉత్తర్వులను అందజేశారు.

అఖిలేష్, కుమారస్వామి, ఇతర నేతలు సిఎం కేసిఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో బిఆర్ఎస్ ముందుకు వెళ్లనుంది. ఢిల్లీ లోని సర్దార్ పటేల్ రోడ్ నెంబర్. 5లో ఈ ఆఫీసు ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్