Sunday, May 19, 2024
HomeTrending Newsకేరళ గవర్నర్ నిరాహార దీక్ష

కేరళ గవర్నర్ నిరాహార దీక్ష

వరకట్న రక్కసిని రూపుమాపాలని కోరుతూ.. కేరళ గవర్నర్​ ఆరిఫ్​ మహమ్మద్​ ఖాన్​ బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటలకు ఆయన నివాసంలో ఈ​ దీక్ష చేపట్టారు. వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా వివిధ గాంధేయవాద సంస్థలు ఆయనకు మద్దతుగా దీక్ష చేపట్టాయి. తిరువనంతపురంలోని గాంధీభవన్​లో ఈ నిరసనలను ప్రారంభించారు. గవర్నర్ ఈ సాయంత్రం నిరాహార దీక్షను విరమిస్తారు.

అనంతరం గాంధీభవన్​లో నిర్వహిస్తున్న నిరసనల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. వరకట్న వేధింపుల కారణంగా కేరళలో ఇటీవల వరుస ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. పలువురు మహిళల వరకట్న వేధింపులు తాలలేక మృతి చెందటంపై గవర్నర్ ఆరిఫ్​ మహమ్మద్​ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ​. వరకట్న సంప్రదాయాన్ని రూపుమాపేందుకు తాను స్వచ్ఛందంగా పనిచేస్తానని గవర్నర్​ ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్