Saturday, July 27, 2024
HomeTrending Newsఅమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ

అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ

ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి చెందిన పలువురు ఉన్నత పదవులను దక్కించుకుంటున్నారు. ఇటీవలే యూకే ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. తాజాగా భారత సంతతికి చెందిన అరుణ మిల్లర్ అమెరికాలో ఓ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ అయ్యారు. అరుణ మిల్లర్ అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా ఎన్నిక‌య్యారు. భార‌తీయ సంత‌తికి చెందిన వ్య‌క్తి.. అమెరికాలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కావ‌డం చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. అరుణా మిల్ల‌ర్ వ‌య‌సు 58 ఏళ్లు. ఆ రాష్ట్రం నుంచి వెస్ మూర్ గ‌వ‌ర్న‌ర్‌గా ఎన్నిక‌య్యారు. డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన వెస్ మూర్ గవర్నర్ గా… అరుణ మిల్లర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా.. ఇద్దరు నేతలు గెలిచారు.

గ‌వ‌ర్న‌ర్ త‌ర్వాత అత్యున్న‌త హోదాలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఉంటారు. గ‌వ‌ర్న‌ర్ స‌రైన రీతిలో విధులు నిర్వ‌ర్తించ‌లేని స‌మ‌యంలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆ బాధ్య‌త‌ల్ని చూసుకుంటారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల అనంత‌రం అరుణా మిల్ల‌ర్ విజ‌యాన్ని ఖ‌రారు చేశారు. మేరీల్యాండ్‌లో అరుణా మిల్ల‌ర్‌కు పాపులారిటీ ఎక్కువ‌గా ఉంది. రిప‌బ్లిక‌న్ మ‌ద్ద‌తుదారులు కూడా ఆమెకు స‌పోర్ట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. విభ‌జ‌న‌కు బ‌దులుగా ఐక‌మ‌త్యాన్ని మేరీల్యాండ్ ఓట‌ర్లు ఎంచుకున్న‌ట్లు విక్ట‌రీ ప్ర‌సంగంలో అరుణా మిల్ల‌ర్ తెలిపారు.

అరుణా మిల్ల‌ర్ హైదరాబాద్ లో జ‌న్మించారు. అరుణ 7 ఏళ్ళ వయసులో ఆమె తల్లిదండ్రులు కుటుంబంతో సహా  అమెరికాకు వ‌ల‌స వెళ్లారు. సివిల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్న అరుణ… దవే మిల్లర్ ను పెల్లు చేసుకున్నారు. వారికి ముగ్గురు అమ్మాయిలు సంతానం. 1972లో అమెరికా వ‌చ్చాన‌ని, అప్ప‌టి నుంచి అమెరికా కోసం ప‌నిచేశాన‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్