Wednesday, March 26, 2025
HomeTrending Newsబెంగాల్ హింసాకాండపై కేంద్రం సీరియస్

బెంగాల్ హింసాకాండపై కేంద్రం సీరియస్

పశ్చిమ బెంగాళ రాజకీయ వైరం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. ప్రతిపక్ష నేత సువెందు అధికారిని శాసన సభ నుంచి సస్పెండ్ చేయటంతో వివాదం ముదురుతోంది. రాజ్యాంగంలోని 256, 257 అధికరణలను మోదీ ప్రభుత్వం బెంగాల్‌లో విధించే అవకాశం ఉందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేరుగా బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు DGPకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేందుకు సిద్దమైంది.  రాష్ట్ర ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను ఇష్టపడినా, ఇష్టపడకపోయినా వాటిని అనుసరించడానికి ప్రధాన కార్యదర్శి, DGP కట్టుబడి ఉంటారు. కేంద్రం నుండి 2-3 సార్లు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రం వాటిని ధిక్కరిస్తే, గవర్నర్ సిఫార్సుపై రాష్ట్రపతి ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు. అప్పుడు ఏ కోర్టు జోక్యం చేసుకోదు. ఇప్పుడు మమత బెంగాల్‌లో హింసను ఆపాలి, లేకపోతే ఆమె ఒక నెలన్నర మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

ఈ ఏడాది నవంబర్‌లో రాజ్యసభలో బిజెపికి మెజారిటీ వస్తుంది, డిసెంబర్ 1 – మార్చి 31 మధ్య, 25 కొత్త బిల్లులు ఆమోదించబడతాయి, ఇందులో జనాభా నియంత్రణ బిల్లు అత్యంత ముఖ్యమైన బిల్లుగా ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. స్వాతంత్ర్యం వచ్చిన 73 సంవత్సరాలలో, భారతదేశంలో నివసించిన ముస్లింల జనాభా 30 మిలియన్ల నుండి 300 మిలియన్లకు పది రెట్లు పెరిగింది.  ఈ బిల్లు ఆమోదం పొందితే దేశమంతటా ఏకకాలంలో పెద్ద ఎత్తున నిరసనలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది.

వీటికి తోడు పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, విపక్షాల ఆందోళనలతో రాజకీయంగా ఆ దేశంలో అస్థిర వాతావరణం నెలకొని ఉంది. ప్రజల దృష్టి మరల్చేందుకు కాశ్మీర్ తో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులను ప్రోత్సహించే ఎత్తుగడ వేయవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్