Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: ముంబై, బెంగుళూరు విజయం 

ప్రొ కబడ్డీ: ముంబై, బెంగుళూరు విజయం 

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన రెండు మ్యాచ్ ల్లో యూ ముంబా, బెంగుళూరు బుల్స్ తమ ప్రత్యర్థి జట్లపై  ఘనవిజయం సాధించాయి.

యూ ముంబా- జైపూర్ పింక్ పాంథర్స్  మధ్య జరిగిన తొలి మ్యాచ్లో యూపీ 37-28 తేడాతో ఘనవిజయం సాధించింది. ఆట ఫస్ట్ హాఫ్ లో యూ ముంబా 21-12 తో 9 పాయింట్ల ఆధిక్యం సంపాదించింది. రెండో అర్ధ భాగంలో పింక్ పాంథర్స్ పుంజుకొని 16-16 తో సమం చేసినా మొదటి అర్ఘంభాగంలో ముంబై ఆధిక్యం ముందు ఓటమి చెందక తప్పలేదు. ముంబై ఆటగాళ్ళు అజిత్ 11; అభిషేక్ సింగ్ 10 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. జైపూర్ ఆటగాడు అర్జున్ జైస్వాల్ 14 పాయింట్లు సంపాదించి రాణించాడు.

బెంగుళూరు బుల్స్ – హర్యానా స్టీలర్స్ మధ్య జరిగిన  రెండో మ్యాచ్లో బెంగుళూరు  42-28 తేడాతో ఘనవిజయం సాధించింది. ఆట తొలి భాగంలో బెంగుళూరు 19-13 తో ఆధిక్యం సంపాదించింది. రెండో అర్ధ భాగంలోనూ బెంగుళూరు అదే జోరు కొనసాగించి 23-15 తో ఆధిక్యం సంపాదించింది. బెంగుళూరు కెప్టెన్ పవన్ షెరావత్ మొత్తంగా 22 పాయింట్లు సాధించాడు.

18 పాయింట్లతో దబాంగ్ ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా 15 పాయింట్లు సాధించిన బెంగుళూరు రెండో స్థానంలో కొనసాగుతోంది.

Also Read : ప్రొ కబడ్డీ: ఢిల్లీ భారీ విజయం  

RELATED ARTICLES

Most Popular

న్యూస్