Sunday, September 8, 2024
Homeసినిమామలయాళంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్

మలయాళంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్

మైత్రీ మూవీ మలయాళంలో అడుగుపెట్టింది. మిన్నల్ మురళి, తల్లుమల, 2018 చిత్రాలతో వరుస విజయాలు సాధించిన మలయాళ స్టార్ టోవినో థామస్‌తో  ‘నడికర్ తిలకం’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనుంది. సంచలన విజయం సాధించిన డ్రైవింగ్ లైసెన్స్‌ని రూపొందించిన లాల్ జూనియర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తమ మొదటి మలయాళ చిత్రాన్ని గాడ్‌స్పీడ్‌తో కలిసి నిర్మించనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, అల్లన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాతలు.

“‘నడికర్ తిలకం” ముహూర్తం వేడుక ఘనంగా జరిగింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా కొచ్చిలో ప్రారంభించారు. ఈ సినిమాని 120 రోజుల పాటు వివిధ లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. టోవినో థామస్ ఈ చిత్రంలో అనేక సవాళ్ళతో కూడిన సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రను పోషిస్తున్నారు. సౌబిన్ షాహిర్ బాల పాత్రలో కనిపించనుండగా, భావన కథానాయిక. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం ఉంది. ధ్యాన్ శ్రీనివాసన్, అనూప్ మీనన్, షైన్ టామ్ చాకో, అజు వర్గీస్, శ్రీనాథ్ భాసి, లాల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు సినిమా కోసం పని చేస్తున్నారు. ఆల్బీ సినిమాటో గ్రాఫర్ గా  ఉత్కంఠభరితమైన దృశ్యాలను తెర పై ఆవిష్కరించనున్నారు. రతీష్ రాజ్ ఎడిటింగ్  సినిమా అంతటా మనల్ని సీట్ల ఎడ్జ్ లో ఉంచుతుంది. యక్జాన్ గ్యారీ పెరీరా, నేహా నాయర్ సంగీతం సినిమా భావోద్వేగాలకు అనుగుణంగా సరికొత్త అనుభూతిని అందించబోతుంది. ప్రొడక్షన్ డిజైనర్ ప్రశాంత్ మాధవ్ కథకు తగిన అద్భుతమైన సెట్‌లను రూపొందించారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్