Monday, September 23, 2024
Homeసినిమా‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్’ టీమ్ కు కింగ్ అభినందన

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్’ టీమ్ కు కింగ్ అభినందన

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత‌లు బ‌న్ని వాసు, వాసువ‌ర్మ లు సంయుక్తంగా జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న విజ‌య‌ద‌శ‌మికి విడుదలై బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రానికి గోపిసుంద‌ర్ అందించిన ఆడియో సూప‌ర్ సక్సెస్ కావడంతో ఈ సినిమా ఆడియ‌న్స్ ని విప‌రీతంగా ఆక‌ట్టుకుని థియేటర్స్ కి ప్రేక్ష‌కుల్ని ర‌ప్పిస్తుంది.

ఇప్ప‌టికే 40 కోట్లకి పైగా గ్రాస్ వ‌సూలు చేసి అఖిల్ అక్కినేని కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా నిల‌వ‌టం విశేషం. అయితే.. ఈ చిత్ర ఘ‌న‌ విజ‌యం సాధించిన సందర్భంగా కింగ్ అక్కినేని నాగార్జున ‘మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ టీమ్ ని అభినందిస్తూ.. ఆయ‌నే హోస్ట్ గా సెల‌బ్రెట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర యూనిట్ తో పాటు ద‌ర్శ‌కులు సుకుమార్‌, వంశీ పైడిప‌ల్లి, హ‌రీష్ శంక‌ర్‌, మారుతి, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, సుబ్బు, వెంకీ అట్లూరి, డాలి, ప్ర‌తాప్‌, కౌషిక్ హ‌జ‌ర‌య్యారు. ఈ సినిమా ఇంకా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని అకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్