Friday, April 19, 2024
HomeTrending Newsమోడీది సేల్స్ మెన్ పాలన - కేటిఅర్

మోడీది సేల్స్ మెన్ పాలన – కేటిఅర్

Narendra Modi Salesmen :

రెండు సార్లు ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన జుగుప్సా కరమైన, హేయమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. నడ్డా అంటే నిన్నటి దాకా ఒక గౌరవం ఉండేది
…అసంబద్ధ వ్యాఖ్యలతో నడ్డా స్థాయి బండి సంజయ్ తో సమానంగా మారిందన్రినారు. టీ.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కే టీ రామారావు తెలంగాణ భవన్ లో ఈ రోజు విలేఖరులతో మాట్లాడుతూ బిజెపి నేతల వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ప్రెస్ మీట్ లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఏ. జీవన్ రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, దాసరి మనోహర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

టీ.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కే టీ రామారావు విమర్శలు ఆయన మాటల్లోనే…

బీజేపీ నేతల తీరు చూస్తే బీజేపీ ని బాక్వాస్ జుమ్లా పార్టీ గా పేరు మార్చొచ్చు. బీజేపీ మీడియా ను మోడియా గా మార్చింది.
…మోడీ ఈ ఏడేండ్లలో చేసిన మంచి పని ఒక్కటి లేదు. బీజేపీ ని జుమ్లా పార్టీ అంటే మా మీద హంలా చేస్తారు. బీజేపీ కి సీబీఐ, ఈడీ,nia భాగస్వామ్య పక్షాలుగా మారాయి. యూపీ లో బీజేపీ అభివృద్ధి పేరిట ఓట్లు అడగడం లేదు. విద్వేషాలు రెచ్చ గొట్టడం తోనే ఓట్లు పొందాలని బీజేపీ అక్కడ విష ప్రచారం చేస్తోంది. మోడీ ది సిగ్గు మాలిన ప్రభుత్వం. 2022 కల్లా ఇండియా లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అని మోడీ హామీ ఇచ్చారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని కూడా హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి టాయిలెట్ నల్లా అన్నాడు మోడీ.. కనీసం గుజరాత్ లోనైనా ఇచ్చావా. జుమ్లా,హంలాలు బీజేపీ జుగల్ బందీ గా మార్చి పాలన చేస్తోంది. మోడీ రైతు విరోధి గా మారారు.

పంజాబ్ లో రైతుల నిరసన తో పీఎం మోడీ పంజాబ్ లో ఎన్నికల సభ ను రద్దు చేసుకున్నారు. ఇంతటి దౌర్భాగ్యం ఏ పీఎం కు రాలేదు. కేసీఆర్ ది స్టేట్స్ మన్ పాలన, మోడీది సేల్స్ మెన్ పాలన. నడ్డా అబద్ధాల అడ్డా కేర్ ఆఫ్ ఎర్రగడ్డ
..అర పైసా ఉపయోగ పడే పని మోడీ దేశానికి ఏమైనా చేశారా. ఇంత దిక్కుమాలిన, దౌర్భాగ్యపు కేంద్ర ప్రభుత్వం ఉందా
.. కాళేశ్వరం కేసీఆర్ కు ఎటిఎం అంటావా. కేసీఆర్ నిజం ఎటిఎం యే.. ఏటీఎం అంటే అన్నదాతకు తోడుండే మెషిన్. దిక్కుమాలిన బీజేపీ కి మా ప్రభుత్వ పథకాలే కాపీ కొట్టడానికి పనికొస్తున్నాయి. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకుండా నడ్డా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. కల్లాలలో వడ్ల నుంచి కంటోన్మెంట్ రోడ్ల దాకా అంతా బీజేపీ కిరికిరే. నీతి ఆయోగ్ కున్న నీతి నడ్డా కు లేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా. రైతులను ఢిల్లీ లో బీజేపీ ఎంత ఇబ్బంది పెట్టింది. లక్షలాది మంది రైతుల గోస గుచ్చుకున్న చరిత్ర బీజేపీ ది.

కేంద్ర మంత్రి బలుపుతో రైతులను కారు తో తొక్కించి చంపినా చర్యలు తీసుకోని బీజేపీ మా గురించి మాట్లాడటమా. కుటుంబ పాలన గురించి బీజేపీ మాట్లాడమా. నడ్డా అత్త జయశ్రీ బెనర్జీ ఎంపీ గా మంత్రి గా పని చేయలేదా. బీజేపీలో ఎంత మంది నాయకులు వారి వారసులు రాజకీయాల్లో లేరూ? మేము ఉద్యమాల్లో పాల్గొని ప్రజలు ఎన్నుకుంటే గెలిచాం. బీజేపీ పాలిత కర్ణాటక లో అవినీతి అత్యంత ఎక్కువ అని మీడియా సంస్థలు మేధావులు ఘోషిస్తున్నారు. నడ్డా అవినీతి గురించి మాట్లాడటమా. నడ్డా పెద్ద పోటు గాడా?

బండి సంజయ్ తన గుండు తానే పగుల గొట్టుకుంటున్నాడు.బండి పోతే బండి వస్తుంది.. గుండు పోతే గుండు వస్తుందా. తెలంగాణలో ఏం కొంపలు మునిగాయని నడ్డా హైద్రాబాద్ వచ్చాడు? బీజేపీ ఎర్రగడ్డ మాటలు, ఎర్రగడ్డ చేతలు ప్రజలు అన్నీ చూస్తున్నారు. మిషన్ భగీరథ గొప్పదని చెప్పిన మంత్రి షేకావత్ కు మెంటలా.. నీళ్లు రాలేవని చెప్పిన నడ్డా కు మెంటలా. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని సన్నాసి రేవంత్ అడిగితే కేంద్రమే పార్లమెంటు లో జవాబిచ్చింది.  కేంద్రం కరెక్టా.. నడ్డా కరెక్టా. ఉద్యోగులకు బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీ ని నమ్ముతారు. ఉద్యోగుల స్థానికత కోసమే 317 జీఓ ఇచ్చాము. మాది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. వారి తాటాకు చప్పుళ్లకు బెదిరే వారు ఎవ్వరూ లేరు. భయ పడితే తెలంగాణ వచ్చేదా. మార్కెట్ లో బీజేపీ కి భయపడే వారు ఎవరైనా ఉండొచ్చు. మేము కచ్చితంగా బీజేపీ వెంట పడుతూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటాం. దేంట్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కేసీఆర్ తెలంగాణ బాగు కోసం పడుతున్న తపన ఎవరు అడ్డుకున్న ఆగదు. తప్పుడు ప్రకటనలతో బీజేపీ యూపీ లో ఓట్లు పొందే ప్రయత్నం చేస్తోంది. బొచ్చు ,రొచ్చు అరవింద్ మాటలకు స్పందించాల్సిన అవసరం లేదు.

Also Read : ప్రధాని మోడీకి నిరసన సెగ

RELATED ARTICLES

Most Popular

న్యూస్