Sunday, September 8, 2024
HomeTrending Newsఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

పరిశ్రమలు, వాహనాల రద్దీ, దీపావళి పటాకుల మోతతో దేశ రాజధాని కాలుష్య కాసారంగా మారింది. ఆది, సోమవారాల్లో అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 265గా నమోదయింది. దీని ప్రకారం ఇక్కడ గాలి పీల్చేందుకు ఏమాత్రం అనువు కాదు. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వెలువడే గాలిలో కూడా 265 ఏక్యూఐ ఉండదు. అయితే గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఇదే తక్కువ కాలుష్యం అని కాలుష్య నియంత్రణ బోర్డు తెలపడం గమనార్హం. సాధారణంగా దీపావళి సమయంలో ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోతుంటుంది. పటాకులు పేల్చడంతో పాటు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు పొలాల్లో గడ్డి కాలబెట్టడంతో కాలుష్యం పెరుగుతూ ఉంటుంది. దీపావళి సందర్భంగా సోమ, మంగళవారాల్లో గాలి నాణ్యత మరింత పడిపోయింది..సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ అంచనా ప్రకారం ఢిల్లీలో వెలువడే గాలి పీల్చేందుకు ఏమాత్రం అనువు కాదని తేల్చేసింది.

ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు పోతున్న నేపథ్యంలో దాని ప్రభావం మనుషులపై తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరి 327 కు చేరింది. మధుర రోడ్ లో 293, గురుగ్రామ్ లో మోడరేట్ కేటగిరీలో 156 గా నమోదయింది. ఇప్పటికే ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో ప్రజలు విషపూరితమైన గాలిని పీల్చుకుంటున్నారు. దీపావళి నేపథ్యంలో ఈ గాలి మరింత విషపూరితమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం ప్రధానంగా ఊపిరితిత్తుల సమస్యలతో మాత్రమే ముడిపడి ఉంటుంది. ఇది ఆస్తమా రోగుల సమస్యను మరింత జటిలం చేస్తుంది. వాస్తవానికి కొన్ని సంవత్సరాలుగా యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఇందుకు వాయు కాలుష్యం కూడా ఒక ప్రధాన కారణం.

హానికారక వాయువుల వల్ల రక్తం గడ్డ కడుతుంది. ఇది అంతిమంగా గుండెపోటుకు దారితీస్తుంది. రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె ధమనుల లోపలి పొర దెబ్బతింటుంది. ఇది కొలెస్ట్రాల్, కరోనరీ ఆర్టరీ వ్యాధికి దారితీస్తుంది. ఈ కాలుష్య కణాలు మళ్ళీ రక్తంలో కలిసిపోయినప్పుడు హార్ట్ బీట్ లో తేడా వస్తుంది. కొన్నిసార్లు ఆకస్మిక మరణం సంభవిస్తుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే కాలుష్యాన్ని వెదజల్లే పదార్థాలను గాల్లోకి విడుదల చేయకూడదు. మొక్కలను విరివిగా పెంచాలి. సమయం దాటిన వాహనాలను తుక్కు కింద పరిగణించాలి. సాధ్యమైనంతవరకు కాలినడకకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేసినప్పుడే మనుషుల మనుగడ బాగుంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్