Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

పారాలింపిక్స్ లో ఇండియా నాలుగో స్వర్ణాన్ని సాధించింది. రెండు స్వర్ణాలు, ఒక్కో రజత, కాంస్య పతకంతో  నేడు మొత్తం నాలుగు పతకాలు గెల్చుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.ఎల్-3 విభాగంలో ఇండియా ఆటగాడు ప్రమోద్ భగత్ స్వర్ణం గెల్చుకోగా, మనోజ్ సర్కార్ కాంస్యం సాధించాడు.

ప్రమోద్ భగత్ ఫైనల్ మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ ఆటగాడు డానియెల్ బెతెల్ పై రెండు వరుస సెట్లలో 21-14, 21-17 తేడాతో విజయం సాధించి స్వర్ణం గెల్చుకున్నాడు. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్ లో మనోజ్ సర్కార్ జపాన్ క్రీడాకారుడు డైసుకే ఫుజిహర ను ­22-20, 21-13 తేడాతో ఓడించాడు. మొదటి సెట్ హోరాహోరీ సాగినప్పటికీ రెండో సెట్ ను మనోజ్ అవలీలగా గెల్చుకున్నాడు.

బ్యాడ్మింటన్ ఎస్.ఎల్.3లో స్వర్ణం, కాంస్యం గెల్చుకోవడం ద్వారా ఒక విభాగంలో మనదేశానికే చెందిన ఇద్దరు ఆటగాళ్ళు పతకాలు సాధించడం ఇది మూడోసారి. అదీ ఈ టోక్యో పారాలింపిక్స్ లోనే కావడం విశేషం.

ఆగస్ట్ 31న జరిగిన హై జంప్ టి-63 పోటీలో మరియప్పన్ తంగవేలు-రజత, శరద్ కుమార్ -కాంస్య పతకాలు సాధించారు.

నేటి ఉదయం జరిగిన పి-4 మిక్సడ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్.హెచ్.-1 విభాగంలో మనీష్ నర్వాల్ స్వర్ణం, సింగ్ రాజ్ అధానా రజతం గెల్చుకున్నారు.

నేడు సాధించిన నాలుగు విజయాలతో ఇండియా పతకాల సంఖ్య 17కు చేరింది. వీటిలో 4 స్వర్ణం, 7 రజతం, 6 కాంస్య పతకాలు ఉన్నాయి పతకాల పట్టికలో ఇండియా ప్రస్తుతం 26వ స్థానానికి చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com