Tuesday, September 17, 2024
Homeసినిమా'ప్రాజెక్ట్ కే' గురించి ఇంట్రస్టింగ్ న్యూస్

‘ప్రాజెక్ట్ కే’ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే‘. ఈ చిత్రాన్ని  వైజయంతీ మూవీస్ బ్యానర్ పై చలసాని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జంటగా దీపికా పడుకునే నటిస్తుంటే… కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. శ్రీనివాసరావు.. ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ కు ఒక గైడ్ లా సలహాలు సూచనలు అందిస్తున్నారు. దీంతో ఆడియన్స్ లో ఈ సినిమా పై మరింత క్యూరియాసిటీ పెరిగింది.

అయితే.. ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ వ్యవహరాలు అప్పుడే స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. అశ్వనీదత్ ఈ సినిమాని చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకున్నారు. నిర్మాణపరంగా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. న్యూయర్ సందర్భంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే..  ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థం అవుతుంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ పెద్దగా రాకముందే కొన్ని ఏరియాల నుంచి భారీ స్థాయిలో ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నైజాంకు చెందిన బడా సిండికేట్ గ్రూప్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులను దాదాపు 70 కోట్లు కొనుగోలు చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఏషియన్ సునీల్, నిర్మాత సురేష్ బాబు కూడా చాలా కాలంగా డిస్ట్రిబ్యూషన్ సిండికేట్ ను కొనసాగిస్తున్నారు. గతంలో వీరి కలయికలో సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు విడుదలయ్యాయి. అలాగే ఇటీవల ధమాకా సినిమాను కూడా గ్రాండ్ గా విడుదల చేశారు. ఇక ఆ సినిమాలతో అయితే వీరికి భారీ స్థాయిలో లాభాలు వచ్చాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ కే మూవీ నైజాం హక్కులను కూడా సొంతం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి.. ఈ ప్రాజెక్ట్ కే మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్