Saturday, September 21, 2024
Homeసినిమా‘స‌ర్కారు వారి పాట’ ఫ‌స్ట్ సింగిల్ ప్రొమో రిలీజ్

‘స‌ర్కారు వారి పాట’ ఫ‌స్ట్ సింగిల్ ప్రొమో రిలీజ్

First Single Promo: సూప‌ర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా ‘గీత గోవిందం’ ఫేమ్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేష్‌ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో మ‌హేష్ బాబు స‌ర‌స‌న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ న‌టిస్తుంది. ఈ భారీ, క్రేజీ మూవీని మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈరోజు సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ‘వందో .. ఒక వెయ్యో .. ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా .. ఏందే ఈ మాయ..’ అంటూ ఈ పాట మొదలవుతోంది. క‌థానాయిక‌ కీర్తి సురేష్‌ ను ఫాలో అవుతూ మహేష్‌ బాబు పాడే పాట ఇది. ఫారిన్లో చిత్రీకరించారు. దీనికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ త‌మ‌న్ సంగీత అందించారు. సిద్ శ్రీరామ్ ఈ పాట‌ను ఆల‌పించారు. ఇక‌ పూర్తి పాటను ఈ నెల 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్ర‌క‌టించారు. భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు.. ఇలా వ‌రుస‌గా విజ‌యాలు సాధించిన మ‌హేష్ ‘స‌ర్కారు వారి పాట‌’తో కూడా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధిస్తాడేమో చూడాలి.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్