Singapore Open: తొలి రౌండ్ లోనే సింధు, ప్రణయ్  ఔట్! కిడాంబి విజయం

సింగపూర్ ఓపెన్ లో తొలిరోజే ఇండియాకు నిరాశ ఎదురైంది. స్టార్ ఆటగాళ్ళు పివి సింధు, హెచ్ ఎస్ ప్రణయ్ నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రాజావత్….  డబుల్స్ లో ధృవ్-అర్జున్ జోడీ  విజయం సాధించారు.

  • కిడాంబి శ్రీకాంత్ 21-15;21-19 తేడాతో థాయ్ లాండ్ ప్లేయర్ కంటాఫోన్ ను ఓడించాడు.
  • ధృవ్ కపిల- ఎమ్మార్ అర్జున్ జోడీ 21-16; 21-15 తో ఫ్రాన్స్ ద్వయం లుకాస్ కోర్వీ-రోనన్ లబర్  లపై విజయం సాధించారు.
  • ప్రియాన్షు రాజావత్ 21-12; 21-15 తేడాతో జపాన్ ఆటగాడు కాంటాసునేయమ పై గెలుపొందాడు.

పురుషుల సింగిల్స్ లో

  • హెచ్ ఎస్ ప్రణయ్ 15-21;19-21 తో జపాన్ కు చెందిన కొడాయ్ నరౌకా చేతిలో ఓడిపోయాడు.
  • లక్ష్య సేన్ పై చైనీస్ తీపీ ప్లేయర్ చౌ టీన్ చెన్ 18-21; 21-17;21-13 తో విజయం సాధించాడు

మహిళల సింగిల్స్ లో….

  • పివి సింధుపై జపాన్ ప్లేయర్ అకానే యమగుచి 18-21; 21-19, 21-17 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్ గెల్చుకున్న సింధు ఆ తర్వాత ప్రత్యర్థి ధాటికి తలొగ్గింది.
  • సైనా నెహ్వాల్ పై థాయ్ లాండ్ క్రీడాకారిణి రత్చనోక్ ఇంటానన్ 21-13; 21-15 తేడాతో
  • ఆకర్షి కాశ్యప్ కూడా థాయ్ లాండ్ కే చెందిన సుపథ కతెతాంగ్ చేతిలో 21-17;21-19 తో ఓటమి పాలయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *