Monday, September 23, 2024
Homeసినిమామిస్ ఇండియా దర్శకుడితో నిర్మాత మధు కాలిపు కొత్త చిత్రం

మిస్ ఇండియా దర్శకుడితో నిర్మాత మధు కాలిపు కొత్త చిత్రం

New film: క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెర‌కెక్కిస్తున్న‌ ‘రంగమార్తాండ’ చిత్ర నిర్మాత మధు కాలిపు, కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ మూవీ దర్శకుడు నరేంద్రనాథ్ తో ఒక సినిమా నిర్మించ‌నున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవబోతోంది. రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్  లో మధు కాలిపు ఈ సినిమా నిర్మించబోతున్నారు. రాజ శ్యామల సంస్థ కథకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు నిర్మించ‌నుంది. పెద్ద స్టార్స్ తో కమర్షియల్, భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మంచి విలువలు, ఎమోషన్స్ ఉన్న సినిమాలని కూడా నిర్మించేంద‌కు ప్లాన్ చేస్తుంది.

ఈ సంస్థ నిర్మించే తదుపరి సినిమాలు అన్ని పాన్ ఇండియా సినిమాలే. ‘రంగమార్తాండ’ సినిమా, మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’ కి రీమేక్. ఆ సినిమా ఈ వేసవికి విడుదల కాబోతోంది. అయితే.. దర్శకుడు నరేంద్రనాథ్ తో ఈ బ్యానర్ లో ఒక యాక్షన్ డ్రామా తెరకెక్కబోతోంది. ఈ కొత్త సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో చిత్ర దర్శక నిర్మతలు ప్రకటించబోతున్నారు.

Also Read : మేఘ ఆకాష్ కొత్త సినిమా ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్