Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్సానియా- బోపన్న జోడీదే విజయం

సానియా- బోపన్న జోడీదే విజయం

వింబుల్డన్ లో మిక్స్డ్ డబుల్స్ విభాగం తొలి రౌండ్లో  ఇండియాకు చెందిన సానియా మీర్జా- ఆర్. బోపన్న జోడీ విజయం సాధించింది. ఈ జోడీ మన దేశానికే చెందిన  రామనాథన్- అంకిత రైనా జోడీపై ­6-2, 7-6 తేడాతో విజయం సాధించారు.

సానియా-బోపన్న జోడీ మొదటి సెట్ సునాయాసంగా గెల్చుకున్నప్పటికీ, రెండో సెట్లో రైనా-రామనాథన్ లు గట్టి పోటీ ఇచ్చారు.  చివరి వరకు హోరాహోరీగా సాగిన సెట్ లో చివరకు సానియా జోడీ పైచేయి సాధించారు.

ఒకే దేశానికి చెందిన నలుగురు ఆటగాళ్ళు ఇలా మిక్స్డ్ డబుల్స్ లో తలపడడం ఓ అరుదైన విషయం. మరికాసేపట్లో జరిగే  మరో మ్యాచ్ లో ఇండియాకు చెందిన శరణ్, అమెరికాకు చెందిన సామంత ముర్రేతో కలిసి మరో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ ఆడనున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్