Sunday, September 8, 2024
Homeసినిమాప్లీజ్ అలా చేయొద్దు: సినిమా యూనిట్ విజ్ఞప్తి

ప్లీజ్ అలా చేయొద్దు: సినిమా యూనిట్ విజ్ఞప్తి

don’t do it: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న‌ సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అత్యంత‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ తూర్పు గోదావ‌రి ప‌రిస‌ర ప్రాంతంలో జ‌రుగుతుంది. దీనికి సంబంధించి లోకేష‌న్ నుంచి కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. షూటింగ్ చూడ‌టానికి వ‌చ్చిన కొంద‌రు ఔత్సాహికులు త‌మ సెల్ ఫోన్స్‌లో ఫొటోల‌ను తీయ‌డం, వీడియోలు చిత్రీక‌రించ‌డం వంటివి చేసి వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇలా చేయ‌డం చిత్ర‌యూనిట్‌కు ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో వారు ఓ ప్ర‌క‌ట‌న‌న‌ను విడుద‌ల చేశారు. క‌థానుగుణంగా సినిమాను జ‌నాల మ‌ధ్య చిత్రీక‌రించాల్సి వ‌స్తుంది. కొంద‌రు స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించి సోష‌ల్ మాధ్య‌మాల్లో పోస్ట్ చేస్తున్నారు. మా యాంటీ పైర‌సీ సెల్ ఇలాంటి కంటెంట్ పై ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ పెడుతుంది. అలా పోస్ట్ చేసిన వారి ఐడీల‌ను క‌నిపెట్టి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం అని తెలియజేసింది చిత్ర యూనిట్.

Also Read : రాజ‌మండ్రిలో రామ్ చ‌ర‌ణ్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్