Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్Singapore Open-2022:  సింధు, సైనా గెలుపు, కిడాంబి ఓటమి

Singapore Open-2022:  సింధు, సైనా గెలుపు, కిడాంబి ఓటమి

సింగపూర్ ఇండోర్ స్టేడియంలో మొదలైన సింగపూర్ ఓపెన్-2022 టోర్నమెంట్ తొలి రౌండ్ లో భారత ఆటగాళ్ళు పివి సింధు, సైనా నెహ్వాల్, అష్మిత చలీహ, హెచ్ ఎస్ ప్రణయ్, మిథున్ మంజునాథ్ లు తమ ప్రత్యర్ధులపై విజయం సాధించారు.

మహిళల సింగిల్స్ లో…

పివి సింధు 21-15;21-11 తో లియాన్నెటన్ (బెల్జియం)పై

అష్మిత చలీహా 21-16;21-11 తో బుసానన్ (థాయ్ లాండ్)పై

సైనా నెహ్వాల్ 21-18;21-14 తో మన దేశానికే చెందిన మాళవిక  బన్సోద్ పై విజయం సాధించారు.

పురుషుల సింగిల్స్ లో….

మిథున్ మంజునాథ్ 21-17;15-21;21-18తో మన దేశానికే చెందిన కిడాంబి శ్రీకాంత్ పై

హెచ్ ఎస్ ప్రన్నోయ్ 21-13;21-16తో సిట్టికాన్ తమన్సన్ (థాయ్ లాండ్)పై

మిక్స్డ్ డబుల్స్ లో హెచ్.వి. నితిన్- రామ్ పూర్విష జోడీ 21-15;21-14తో  ఇజ్రాయెల్ జంట మిషా-స్వెట్లానాపై గెలుపొందారు

మహిళల డబుల్స్ లో  పూజా దండు- ఆర్తి సారా సునీల్ జోడీ ప్రత్యర్థులు వైదొలగడంతో వాకోవర్ ద్వారా రెండో రౌండ్ కు చేరుకున్నారు.

కాగా… కిడంబి శ్రీకాంత్ తో పాటు… పారుపల్లి కాశ్యప్, సమీర్ వర్మ తమ ప్రత్యర్థులపై పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్