Sunday, May 19, 2024
Homeస్పోర్ట్స్Hylo Open-2022:  క్వార్టర్స్ కు శ్రీకాంత్, బన్సోద్

Hylo Open-2022:  క్వార్టర్స్ కు శ్రీకాంత్, బన్సోద్

జర్మనీలో జరుగుతోన్న హైలో ఓపెన్-2022లో భారత ఆటగాళ్ళు కిడాంబి శ్రీకాంత్, మాల్విక బన్సోద్ లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. వీరితోపాటు మహిళల డబుల్స్ లో త్రెసా జాలీ-గాయత్రి గోపీచంద్; పురుషుల డబుల్స్ లో సాత్విక్- చిరాగ్ జోడీ లు కూడా క్వార్టర్స్ లో ప్రవేశించారు.

పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్ ఫ్రెంచ్ ఆటగాడు ఆర్నాడ్ మెర్కెల్ పై 11-21;21-13;21-10  తేడాతో విజయం సాధించాడు.

మహిళల సింగిల్స్ లో మాళవిక బన్సోడ్  స్కాట్లాండ్ క్రీడాకారిణి కిర్ స్టీ గిల్మోర్ పై 24-22; 19-7 తో ఆధిక్యంతో ఉన్న సమయంలో గిల్మోర్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగింది. దీనితో బన్సోడ్ తర్వాతి రౌండ్ కు చేరుకుంది.

పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ 22-24;21-15;21-11 తేడాతో ఇంగ్లాండ్ ద్వయంపై విజయం సాధించారు.

మహిళల డబుల్స్ లో త్రెసా జాలీ –గాయత్రి గోపీచంద్ జోడీ డచ్ ద్వయం డెబొరా జిల్లె-చెరిల్ సీనెన్ పై 21-18;21-19 తేడాతో గెలుపొందారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్