New committee: 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులుగా ఆర్.డి.ఎస్.ప్రకాష్, సురేష్ కవిరాయని, జనరల్ సెక్రెటరీగా ఎం. లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా ఎస్. నారాయణరెడ్డి ఎం.డి. అబ్దుల్, ట్రెజరర్ గా పి.హేమసుందర్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా: తాటికొండ కేశవాచారి, వీర్ని శ్రీనివాసరావు, టి. మల్లిఖార్జున్, రమేష్ చందు, ధీరజ్ అప్పాజీ, నవీన్, రవి గోరంట్ల ఎన్నికయ్యారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బి.ఏ. రాజు, జయ గార్ల గౌరవార్థం వారి కుమారుడు బి.ఏ. శివకుమార్ ను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మెంబర్ గా, కమిటీ ఆమోదంతో ఈసీ మెంబర్ గా తీసుకున్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ “ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు 50 సంవత్సరాల చరిత్ర ఉంది. నిజమైన ఫిల్మ్ జర్నలిస్టులు ప్రారంభమైంది ఈ సంస్థ ద్వారానే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ అసోసియేషన్ ఫస్ట్ టైమ్ మెంబర్స్ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అలాగే మెంబర్స్ ఎవరైనా చనిపోతే 25,000 ఇవ్వాలని అప్పుడు తీర్మానించుకోవడం.. ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు మళ్లీ ఏకగ్రీవంగా రెండోసారి నన్ను ప్రెసిడెంట్ ని చేయడం అనేది చాలా సంతోషంగా ఫీలవుతున్నాను. నా మీద అంత నమ్మకం ఉంచినందుకు మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. గతంలో నేను ఎలాగైతే సంస్థ అభివృదికి.. సభ్యులకు సంక్షేమానికి కృషి చేశానో.. ఇప్పుడు ఈ కమిటీలో ఉన్న సభ్యులందరి సహకారంతో ఇంకా మంచి పనులు చేయాలని.. చేస్తానని మాట ఇస్తున్నాను. ప్రతి మెంబర్ కి ఉపయోగపడేలా నిర్ణయాలు.. కమిటీ సభ్యుల ఆమోదంతో తీసుకోవడం జరుగుతుంది. సినిమా జర్నలిస్టుల అసోసియేషన్లో కీలకమైంది మాత్రం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అని నేను ఖచ్చితంగా చెప్పగలుతాను” అన్నారు.