Friday, September 20, 2024
Homeసినిమాబాలీవుడ్ పై గట్టిగానే దృష్టిపెట్టిన 'కంగువ' 

బాలీవుడ్ పై గట్టిగానే దృష్టిపెట్టిన ‘కంగువ’ 

సూర్య హీరోగా ‘కంగువ’ సినిమా రూపొందుతోంది. స్టూడియో గ్రీన్ – యూవీ వారు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. ఇంతకుముందు మాస్ యాక్షన్ సినిమాలతో భారీ హిట్స్ ఇచ్చిన శివ, ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అధికారికంగా ఈ డేట్ ను ప్రకటించారు కూడా. వివిధ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

ఈ మధ్య కాలంలో సూర్యకి సరైన ఇట్ పడలేదు. ఇక ఆయన సినిమాలకి హిందీ మార్కెట్ కూడా తక్కువగానే ఉంది. గతంలో అక్కడ విడుదలై రికార్డులు సృష్టించిన సినిమాలు పెద్దగా లేవు. అందువలన ఈ సినిమాకి సంబంధించి, బాలీవుడ్ లో బలమైన ప్రమోషన్స్ చేయాలని టీమ్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం 350 కోట్ల వరకూ ఖర్చు చేశారు. 1000 కోట్ల వరకూ రాబట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ స్థాయిలో వర్కౌట్ కావాలంటే హిందీ మార్కెట్ ను పట్టుకోవలసిందే.

ఇప్పుడు ఈ ప్రయత్నంలోనే ‘కంగువ’ టీమ్ ఉన్నట్టుగా చెబుతున్నారు. ‘కంగువ’ రెగ్యులర్ సినిమా కాదు .. కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.  అందుకు తగిన విజువల్స్ తెరపై అద్భుతాలు చేయనున్నాయి. ఒక కొత్త ప్రపంచంలో విహరింపజేసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ విషయాన్నే హిందీలో ఎక్కువగా ప్రమోట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో టీమ్ సక్సెస్ అయితే, ‘కంగువ’ ఖాతాలో వెయ్యి కోట్లు వచ్చి పడినట్టే. బాబీ డియోల్ – దిశా పటాని ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్