Sunday, May 19, 2024
HomeTrending Newsతెలంగాణ పురపాలికలకు అవార్డుల పంట

తెలంగాణ పురపాలికలకు అవార్డుల పంట

తెలంగాణలోని పురపాలికలు మరోసారి జాతీయ స్థాయిలో భారీగా స్వచ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డులను దక్కించుకున్నాయి. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ 2022లో భాగంగా తెలంగాణ‌లోని 16 మున్సిపాలిటిలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌కు అవార్డులు ద‌క్కాయి. కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ జాతీయ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించిన సమస్యల పరిష్కారాలను, మ‌రియు గార్బెజ్ ఫ్రీ సిటీ (జీఎఫ్‌సీ) వాటికి స్టార్ రేటింగ్ ఇచ్చి (జూలై 2021 నుంచి జ‌న‌వ‌రి 2022 కాలానికి) ఈ అవార్డులకు ఎంపిక చేశారు. పారిశుద్ద్యం, మున్సిపల్ సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ మ‌రియు అయా అంశాలపై ప్రజల్లో అవగాహణ కల్పించడం గురించి దేశవ్యాప్తంగా ఉన్న 4,355 ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల్లో ఈ స్వచ్చసర్వేక్షణ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ పోటీలో భాగంగా తెలంగాణ‌లోని 16 పట్ట‌ణ స్థానిక సంస్థ‌లు అవార్డుల‌ను ద‌క్కించుకున్నాయి. వీటిని ఎంపిక చేయ‌డానికి 90 అంశాల‌ను ప్రాతిప‌దిక‌న తీసుకొని ఎంపిక చేశారు. శాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్‌, లిట్ట‌ర్ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు, క‌మ్యూనిటి లెవ‌ల్ కంపోస్టింగ్‌, ప్ర‌జా మ‌రుగుదోడ్లు, క‌మ్యూనిటి టాయిలెట్ల నిర్వ‌హ‌ణ‌, లిక్విడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్‌, ప్ర‌జ‌ల అవ‌గాహ‌న, సిటిజ‌న్ ఎంగెజ్‌మెంట్ మ‌రియు ఇన్నోవేష‌న్స్ లో అవార్డుల‌ను ఎంపిక చేశారు. అవార్డుల‌కు ఎంపికైన ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌కు అక్టోబ‌రు 1వ తేదీన ఢిల్లీలో స్వ‌చ మ‌హోత్స‌వ్ అవార్డుల‌ను ప్ర‌ధానం చేస్తారు. దీంతోపాటు రాష్ట్రంలోని 142 ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల్లో కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ 70 ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌ను ODF + గా, 40 ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌ను ODF++ గా , ఒక ప‌ట్ట‌ణ‌ స్థానిక సంస్థ‌ను వాట‌ర్ +, మిగిలిన 31 ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌ను ODF ప‌ట్ట‌ణాలుగా ప్ర‌క‌టించింది.

తెలంగాణలోని పురపాలికలు ఈసంవత్సరం కూడా భారీగా స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులకు ఎంపిక కావడం పట్ల పురపాలక శాఖ మంత్రి కే .తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పురపాలక సిబ్బంది మరియు అధికారులు అందరికీ అభినందనలు తెలిపారు. అవార్డులకు ఎంపికైన 16 పురపాలికల్లోని మున్సిపల్ సిబ్బంది మరియు ఆయా పురపాలికల్లో ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పట్టణాల అభివృద్ధి కోసం అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలను గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో చేపట్టిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వం చేపట్టిన నూతన పురపాలక చట్టం మరియు పట్టణ ప్రగతి వంటి రెండు ప్రధానమైన కార్యక్రమాల వలన పట్టణాల్లో గుణాత్మకమైన మార్పు సాద్యం అయిందని తెలిపారు. కేవలం పాలనాపరమైన సంస్కరణలు చేపట్టి వదిలేయకుండా, పట్టణాలకు ప్రతి నెల రాష్ట్ర బడ్జెట్ నుంచి నిరంతరం నిధులు అందించడంతో పట్టణాల్లో ప్రజలకు కావలసిన ప్రాథమిక సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ద్వారా అటు పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవకాశం కలిగిందని, దీంతో పాటు అధికారులు తమ విధులను మరింత ఎఫెక్టివ్ గా నిర్వహించేదుకు స్పూర్తి కలిగిందన్నారు. తెలంగాణ పురపాలక శాఖ తరపున పట్టణాల్లో పారిశుద్ధ్యం, పార్కుల అభివృద్ధి ద్వారా గ్రీనరీ పెంచడం, పట్టణ హరిత వనాలు ఏర్పాటు, నర్సరీల ఏర్పాటు, ఫుట్ పాత్ ల నిర్మాణం వంటి ప్రాథమిక అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించడంతో పట్టణాల్లో మార్పు వేగంగా సాధ్యమైందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. తాజాగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ అవార్డులలో తెలంగాణ పల్లెలు, ఆదర్శ గ్రామాలుగా భారీగా అవార్డులు సాధించిన విషయాన్ని సైతం ఈ సందర్భంగా ప్రస్తావించిన కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి పట్టణాలు గ్రామాలు, పట్టాణాల అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతకు గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో దక్కుతున్న అవార్డులే నిదర్శనమని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తనదైన వినూత్నమైన విధానాలు, నిర్ణయాలతో అనేక రంగాల్లో దేశానికి దిక్సూచిగా, ఆదర్శ నమూనాగా నిలుస్తున్నదని, వరుసగా తెలంగాణలోని పట్టణాలకు దక్కుతున్న ఈ అవార్డుల ద్వారా పట్టణ అభివృద్ధి మరియు పట్టణ పరిపాలన రంగాల్లో సైతం తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు

ఈ కింద 16 మున్సిపాలిటిలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌లు ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డుకు ఎంపిక‌య్యాయి.

1.ఆది బ‌ట్ల మున్సిపాలిటి
2. బడంగ్‌పేట్ మున్సిపాలిటి
3. భూత్పూర్ మున్సిపాలిటి
4. చండూర్ మున్సిపాలిటి
5. చిట్యాల మున్సిపాలిటి
6. గ‌జ్వేల్ మున్సిపాలిటి
7. ఘ‌ట్ కేస‌ర్ మున్సిపాలిటి
8. హుస్నాబాద్ మున్సిపాలిటి
9. కొంప‌ల్లి మున్సిపాలిటి
10. కోరుట్ల మున్సిపాలిటి
11. కొత్త‌ప‌ల్లి మున్సిపాలిటి
12.నేరుడుచ‌ర్ల మున్సిపాలిటి
13. సికింద్రాబాద్ కంటోన్మెంట్
14. సిరిసిల్ల మున్సిపాలిటి
15. తుర్క‌యాంజ‌ల్ మున్సిపాలిటి
16. వేముల‌వాడ మున్సిపాలిటి
రాష్ట్రంలో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో రాష్ట్రంలో 142 మున్సిపాలిటిలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల్లో పౌరుల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డం జ‌రిగింది. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు విడుత‌ల్లో చేప‌ట్టడం జ‌రిగింది. మొద‌టి విడ‌త 2020 ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మార్చి 4 వ‌ర‌కు, రెండో 2020 జూన్ 1 నుంచి 8 వ‌ర‌కు, మూడో విడ‌త 2021 జూలై 1 నుంచి 10 వ‌ర‌కు , నాలుగో విడ‌త 2022 జూన్ 3 నుంచి 18 వ‌ర‌కు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

తెలంగాణ రాష్ట్రంలోని ప‌ట్ట‌ణాల్లో డీఆర్‌సీసీ 206లు, బ‌యోమైనింగ్ లెగ‌సీ వెస్ట్ , FSTP, ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. రాష్ట్రంలో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా 1.57ల‌క్ష‌ల వ్య‌క్తిమ‌రుగుదోడ్లు, 9088 ప్ర‌జా మ‌రుగుదోడ్ల‌ను నిర్మించ‌డం జ‌రిగింది. 4713 స్వ‌చ్ఛ ఆటోల‌ను కొనుగోలు చేయ‌డం జ‌రిగింది. ఫీక‌ల్ స్ల‌డ్జ్ ట్రిట్‌మెంట్ ప్లాంట్ (FSTP) ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఇందులో ఇప్ప‌టికే 20 పూర్తి చేయ‌డం జ‌రిగింది. 11 పూర్తి కావ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 108 వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయి.

రాష్ట్రంలోని 142 ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల్లో కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ 70 ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌ను ODF + గా , 40 ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌ను ODF ++ గా , ఒక ప‌ట్ట‌ణ‌ స్థానిక సంస్థ‌ను వాట‌ర్ + , మిగిలిన 31 ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌ను ODF ప‌ట్ట‌ణాలుగా ప్ర‌క‌టించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్