Sunday, September 8, 2024
Homeసినిమా'తీస్ మార్ ఖాన్' ఆకట్టుకుంటుంది : నిర్మాత

‘తీస్ మార్ ఖాన్’ ఆకట్టుకుంటుంది : నిర్మాత

స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటిస్తోన్న తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్‘.  విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది.  ‘నాటకం’ దర్శకుడు కళ్యాణ్ జి గోగణ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచింది. ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

హీరో ఆది మాట్లాడుతూ “ఈ మధ్య నేను కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు చేశాను. కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేశాను కానీ పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు చేసి చాలా రోజులు అయ్యిందనుకుంటున్న టైమ్ లో దర్శకుడు కళ్యాణ్ ఈ కథ చెప్పడం జరిగింది.  ఇప్పటివరకు అన్ని పాటలు ఆన్ లైన్ లోనే రిలీజ్ చేశాము. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇందులో శ్రీకాంత్ అయ్యంగార్,  సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ వంటి మంచి కాస్టింగ్ పెట్టుకున్నారు.  ప్రతి సారి సాయి కార్తీక్ నాకు మంచి మ్యూజిక్ ఇస్తారు. డి. ఓ. పి. గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమా డేట్ అనౌన్స్ చేసిన తరువాత థియేటర్స్ కు జనాలు వస్తారా రారా అని భయముండేది. అయితే బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు  అందరికీ మంచి హోప్ ని ఇచ్చాయి. ఆగస్టు 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలి” అన్నారు.

నిర్మాత డా.నాగం మాట్లాడుతూ “మొదట చిత్ర దర్శకుడు కళ్యాణ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చాను. మేము విడుదల చేసిన టీజర్ కు, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. ఈ నెల 19 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అన్నారు.

Also Read : ఆకట్టుకుంటున్న తీస్ మార్ ఖాన్ ట్రైలర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్