Sunday, September 29, 2024
HomeTrending Newsటీ కాంగ్రెస్ చంద్రబాబు ఫ్రాంచైజీ – కేటిఆర్

టీ కాంగ్రెస్ చంద్రబాబు ఫ్రాంచైజీ – కేటిఆర్

కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని వారు కేసీఆర్ ను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని… మేమేమన్నా అన్నామా అని టి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ధ్వజమెత్తారు. మా మంత్రి మల్లారెడ్డి కి జోష్ ఎక్కువ ..ఓ మాట అన్నారు తప్పేముందని, కాంగ్రెస్ కు దిక్కు లేక చంద్రబాబు ఏజెంట్ ను పీసీసీ అధ్యక్షుడిని చేశారని మంత్రి ఎద్దేవా చేశారు. మంత్రి కేటిఆర్ తెలంగాణ భవన్ లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాట్లాడే భాషేంటి అని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు నమ్మి ఓటుకు నోటు దొంగకు కాంగ్రెస్ నేతలు  పీసీసీ అప్పగించారన్నారు. చెంపమీద కొడతా అంటే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి ని అరెస్ట్ చేసిందని, కొందరు జర్నలిస్టు మిత్రులు కూడా జర్నలిజం ముసుగులో కేసీఆర్ ను ఇష్టమోచ్చినట్లు తిడుతున్నారని కేటిఆర్ అన్నారు. ఓపికకు కూడా సహనం ఉంటుందని, ప్రతిపక్షాలు తిడితే చూస్తూ ఊరుకోవాల అన్నారు.

బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇంకా ఏవైనా భూములు ఉంటే అమ్మడానికా, మేక్ ఇన్ ఇండియా అని సేల్ ఇండియా చేస్తున్నారన్నారు. మోడీ చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు ఎవని, ప్రభుత్వ సంస్థలు అమ్ముతున్నందుకా బండి సంజయ్ యాత్ర అన్నారు. బండి సంజయ్ యాత్రలో ప్రతి ఊరులో ఉన్న నర్సరీలు ,వైకుంఠ థామాలు చూసి మాట్లాడాలన్నారు. మిషన్ భగీరథ ,మిషన్ కాకతీయకు ఒక్క రూపాయి అయినా కేంద్రం ఇచ్చిందా అన్న మంత్రి కేంద్ర ప్రభుత్వం లో 8 లక్షల ఉధ్యోగాలు కాలీగా ఉన్నాయి.. వీటి గురించి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినందుకే ..కొడంగల్ నుంచి తరిమితే..చావు తప్పి కన్ను లొట్ట బోయినట్లు మల్కాజిగిరిలో రేవంత్ గెలిచాడని కేటిఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ముందుగా మంత్రి మల్లారెడ్డి సవాల్ పై మాట్లాడి  తర్వాత గజ్వేల్ సభ  గురించి మాట్లాడితే మంచిదన్నారు. టీ కాంగ్రెస్ ను చంద్రబాబు ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నడని, చిలక మనదే అయినా ..మాట్లాడిస్తున్నది. చంద్రబాబు అని మంత్రి కేటిఆర్ అన్నారు.

ఢిల్లీలో పార్టీ కార్యాలయ శంకుస్థాపన పై కేటిఆర్ మాటల్లోనే….

సెప్టెంబర్ 2న 12769గ్రామ పంచాయతీ లు , 142మున్సిపాలిటీ లలో జెండా పండుగ తో పాటు అదే రోజు నుంచి గ్రామ కమిటీ ల నిర్మాణం మొదలవుతుంది. సెప్టెంబర్ 2 నే ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు..దానికి మేమంతా హాజరవుతాం. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ ,వార్డు కమిటీ లు వేస్తాం. సెప్టెంబర్ 12 నుంచి 20 వరకు మండల కమిటీ లు పూర్తి చేస్తాం. సెప్టెంబర్ 20 తర్వాత జిల్లా కమిటీ ల నిర్మాణం పూర్తి చేస్తాం. మొత్తానికి సెప్టెంబర్  నెలలో అన్ని కమిటీ లు పూర్తి చేస్తాం. హైదరాబాద్ లో బస్తి కమిటీ లు  ,డివిజన్ కమిటీ లు వేస్తాం. అన్ని కమిటీ లలో యస్సీ ,యస్టీ ,బీసీ ,మహిళలలుకు 51శాతం కమిటీ లలో ఉండేలా చూస్తాం. క్రియాశీలకంగా పనిచేసేవారికే కమిటీ లలో ప్రాధాన్యత ఇస్తాం. రెండు ,మూడు రోజుల లో జీహెచ్ఎంసీ పరిదిలో ని మా పార్టీ ప్రతినిధులతో సమావేశమవుతాం. సెప్టెంబర్ 1న సాయంత్రం లోపు మా ప్రజాప్రతినిధులు ఢిల్లీ కి చేరుకోవాలని కోరుతున్నాను.

RELATED ARTICLES

Most Popular

న్యూస్