Wednesday, April 2, 2025
HomeTrending Newsప్రజలు, రైతుల కోసమే అప్పులు..TRS

ప్రజలు, రైతుల కోసమే అప్పులు..TRS

రాత్రి విమానంలో తిరిగితే ఎన్ని రాష్ట్రాల్లో కరెంట్ ఉందొ! లేదో సంజయ్ కి తెలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ ఎద్దేవా చేశారు. జితాలకు- అప్పులకు సంబంధం లేదని, కొత్త అప్పులు అడిగేది మరిన్ని ప్రాజెక్టులు కట్టడానికే అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ఆదాయాన్ని భట్టి అప్పులు వస్తాయి…కానీ కేంద్రం కావాలనే అడ్డు పడుతోందని ఆరోపించారు.

8 ఏళ్లలో కేంద్రం వంద లక్షల కోట్లు అప్పులు చేయొచ్చు..మేము మాత్రం చేయొద్దా? అని ప్రశ్నించారు. కేంద్రం వంద లక్షల కోట్లు వేటికోసం చేశారో చెప్పగలరా? అన్న మంత్రి అప్పుల గురించి న్యాయపరమైన నిబంధనలు అన్ని పాటిస్తామన్నారు. రాష్ట్రం ఏర్పాటు నాటికి 7వేలు ఉన్న పరిస్థితి నుంచి 24వేల మెగావాట్ల ఉత్పత్తికి తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ అన్నారు. నేలమీద తిరిగితే విద్యుత్ కనిపించకపోతే..విమానంలో బండి సంజయ్ తిరగాలి..తెలంగాణకు..ఇతర రాష్ట్రాలకు తేడా తెలుస్తుంది కరెంట్ ఉందా? లేదా? అనేదని, కేసీఆర్ ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుతుంటే..కేంద్రం అమ్ముతోందని విమర్శించారు. BHEL సంస్థ నుంచి సామాగ్రి కొన్నాం కాబట్టే…ఇవ్వాళ తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇండియాబుల్స్ అనేది RBI కాదు..ఒక బ్రోకరేజ్ సంస్థ అని సాధ్యం కాదు అనుకున్న రాష్ట్రాన్ని తెచ్చిన మేము- అప్పులు తేలేమా? అని మంత్రి పువ్వాడ అన్నారు.

బండి సంజయ్ నిన్న భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న మాటలు విన్నాక బాధేసిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ అన్నారు. భద్రాద్రికి కేంద్ర ప్రభుత్వం BHEL సంస్థ ఇచ్చిన యంత్రాలే కదా!. సంజయ్ ఆరోపణలు చూస్తుంటే కేసీఆర్, మోడీకి పైసలు ఇచ్చినట్లు ఉన్నాయి. అంబానీ, అదాని వచ్చినా కేసీఆర్ వాళ్లకు ఇవ్వకుండా ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారని, NTPCకి 7 రూపాయలు ఇచ్చి కరెంట్ కొంటున్నాం..ఇప్పుడు కేసీఆర్ ntpc కి పైసలు ఇస్తుండా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ మాటలు తుగ్లక్ కంటే దారుణంగా ఉన్నాయన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో తెలంగాణ ప్రభుత్వం షేర్ హోల్డర్ అని రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో తెలంగాణ ప్రభుత్వం ఈక్విటీ ఉందని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల అప్పులు తీసుకుంటాయి..కానీ తీసుకున్న అప్పును సరిగ్గా చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ చెప్పిందని వినోద్ గుర్తు చేశారు. FRBM నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని, టీఆరెస్ ప్రభుత్వం  చేస్తున్న అప్పులు ప్రజలు- రైతుల కోసమే అన్నారు.

Also Read : ఉచిత విద్యుత్ పేరుతో కెసిఆర్ దోపిడీ

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్