Thursday, March 28, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ బెంగుళూరుపై ముంబై విజయం

ప్రొ కబడ్డీ బెంగుళూరుపై ముంబై విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో యూ ముంబా- బెంగుళూరు బుల్స్ మధ్య నేడు జరిగిన మ్యాచ్ లో 45-34తో ముంబై ఘనవిజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 22-20తో స్వల్ప ఆధిక్యం సంపాదించిన ముంబై రెండో అర్ధభాగంలో తన ఆటకు మరింత పదును పెట్టి 23-14తో పైచేయి సాధించింది. దీనితో మ్యాచ్ ముగిసే నాటికి  11 పాయింట్ల ఆధిక్యంతో విజయ బావుటా ఎగురవేసింది. బెంగుళూరు కెప్టెన్ పవన్ షెరావత్ 14 పాయింట్లు సాధించినా  జట్టు విజయం సాధించలేకపోయింది.  ముంబై రైడర్లు అభిషేక్ సింగ్-10,  రాహుల్ సేత్పాల్-8; అజిత్-8 పది పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… బెంగుళూరు బుల్స్ (46 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (43); హర్యానా స్టీలర్స్ (42); యూ ముంబా (41); బెంగాల్ వారియర్స్ (41); పాట్నా పైరేట్స్ (40) జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్