Friday, April 19, 2024
Homeస్పోర్ట్స్టి 20 జట్టులోకి బిష్ణోయ్, వన్డేలో కులదీప్

టి 20 జట్టులోకి బిష్ణోయ్, వన్డేలో కులదీప్

Rohit is back: స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగే మూడు వన్డేలు, మూడు 20 సిరీస్ లకు టీమిండియా జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడుతున్న 21 ఏళ్ళ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కు వన్డే, టి20 టీమ్ లో చోటు దక్కింది. రాజస్థాన్ డాషింగ్ బాట్స్ మెన్ దీపక్ హుడా కు వన్డేల్లో అవకాశం ఇచ్చారు.  గాయం కారణంగా దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్ళలేకపోయినా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టుతో చేరనున్నాడు. ఫాస్ట్ బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ లకు విశ్రాంతి ఇచ్చారు. కెఎల్ రాహుల్ వ్యక్తిగత కారణాలతో రెండో వన్డే నుంచి అందుబాటులో ఉండనున్నాడు. సౌతాఫ్రికా టూర్ లో వన్డే జట్టులో చోటు దక్కించుకున్న రవిచంద్రన్ అశ్విన్ కు వెస్టిండీస్ తో సిరీస్ కు అవకాశం ఇవ్వలేదు.  భువనేశ్వర్ కుమార్ ను వన్డే జట్టులో తప్పించి టి 20 జట్టులో అవకాశం ఇచ్చారు.  రవీంద్ర జడేజా ఇంకా గాయం నుంచి కోలుకోనందున చోటు కల్పించలేదని బిసిసిఐ వెల్లడించింది.

వన్డే జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, కులదీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్

టి 20 జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్,  రవి బిష్ణోయ్, అక్షర పటేల్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్,  మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్,

ఫిబ్రవరి 6,9,11 తేదీల్లో అహ్మదాబాద్ లో వన్డే మ్యాచ్ లు….. 16, 18, 20 తేదీల్లో కోల్ కతా లో టి20 మ్యాచ్ లు జరగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్