ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 53.98 శాతం ఓటింగ్ నమోదైంది. 12 జిల్లాల్లోని మొత్తం 61 నియోజక వర్గాలకు పోలింగ్ నిర్వహించగా 2.24 కోట్ల మంది ఓటర్లు వోటు హక్కు వినియోగించుకున్నారు. ఐదో విడత బరిలో 692 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ప్రయాగ్ రాజ్, అమేఠీ, రాయ్ బరేలీ, అయోధ్య వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరిగింది. ఇవి కాకుండా సుల్తాన్పూర్, చిత్రకూట్, ప్రతాప్గఢ్, కౌశాంబి, ప్రయాగ్రాజ్, బారాబంకి, బహ్రైచ్, శ్రావస్తి, గోండా జిల్లాల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also Read : ఉత్తరప్రదేశ్లో నాలుగో దశ ప్రశాంతం

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.